దళిత యువకుడిని దారుణంగా కొట్టి మూత్రం తాగించిన అగ్రకుల మూక
30-01-2022
ఈ వారం ప్రారంభంలో Rajasthan రాజస్థాన్లోని చురు జిల్లాలో Jat community జాట్ కమ్యూనిటీకి చెందిన ఎనిమిది మంది వ్యక్తులు 25 ఏళ్ల Dalit Youth దళిత యువకుడు రాకేష్ మేఘ్వాల్ ను అపహరించి, దాడి చేసి, అతనితో వారి మూత్రం తాగించారు. జనవరి 26న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Churu district చురు జిల్లాలోని రుఖాసర్ గ్రామానికి చెందిన Rakesh Meghwal రాకేష్ మేఘ్వాల్ ఇంటికి 26వ తేదీ రాత్రి అదే గ్రామానికి చెందిన జాట్ వర్గానికి చెందిన రాకేష్, రాజేష్, ఉమేష్, తారాచంద్, అక్షయ్, దినేష్, బిడాదిచంద్ బీర్బల్ లు వచ్చి రాకేష్ మేఘ్వాల్ ను కిడ్నాప్ చేసి కారులో పొలాల్లోకి తీసుకెళ్ళారు. అక్కడ అతన్నికర్రలతో, తాళ్ళతో దారుణంగా కొట్టారు. బలవంతంగా మద్యం తాగించారు. ఖాళీ అయిన మద్య బాటిల్ లో నిందితులందరూ మూత్రం పోసి రాకేష్ తో బలవంతంగా తాగించారు.
అనంతరం స్పృహ కోల్పోయిన రాకేష్ మేఘ్వాల్ ను చనిపోయాడనుకొని అతని ఇంటికి దగ్గరలో పడేసి, అతని మొబైల్ ఫోన్ దొంగతనం చేసి పారిపోయారు.
అనంతరం అతన్ని చూసిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించి పోలీసులకు పిర్యాదు చేశారు.
"రాకేష్ జాట్ , రాజేష్ మద్యం బాటిల్ తీసి నన్ను బలవంతంగా తాగించారు మరియు బాటిల్ ఖాళీ అయిన తర్వాత, రాకేష్, రాజేష్, ఉమేష్, తారాచంద్, అక్షయ్, దినేష్, బిడాదిచంద్ మరియు బీర్బల్ ఆ బాటిల్లో మూత్ర విసర్జన చేసి నన్ను తాగించారు అందరూ నన్ను కర్రలు, తాళ్లతో సుమారు అరగంట పాటు కొట్టారు, దీని ఫలితంగా నా శరీరం మొత్తం గాయపడిన గుర్తులు ఉన్నాయి"అని రాకేష్ మేఘ్వాల్ తన పిర్యాదులో పేర్కొన్నారు.
జాట్ కమ్యూనిటీని ఎదిరించే "ధైర్యం" చేసినందుకు (దళితులకు) మీకు సరైన గుణపాఠం చెబుతామంటూ తనను కులపరమైన తిట్లను తిట్టారని, దళితులను కించపరిచే పదాన్ని ఉపయోగించి దుర్భాషలాడారని మేఘవాల్ తన పిర్యాదులో పేర్కొన్నారు.
చురులోని రతన్ఘర్ పోలీస్ స్టేషన్లో మేఘవాల్ ఫిర్యాదు ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది.ఉమేష్, బీర్బల్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసు అధికారులు తెలిపారు.
ʹʹనిందితులను అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నాం. మేఘ్వాల్పై దాడి చేశారన్న ఆరోపణలు నిజమేనని ప్రాథమికంగా తేలింది. నిందితులంతా మేఘ్వాల్తో సమాన వయస్సు గల వారని, వారి మధ్య ఏడాది క్రితం వివాదం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో శత్రుత్వం ఏర్పడిందని ఫిర్యాదుదారు తెలిపారు. ఈ అంశాన్ని పరిశీలిస్తున్నాం. మేఘ్వాల్ వీపుపై చాలా గాయాలు ఉన్నాయి, ఇది తాళ్లతో చేసినట్లు కనిపిస్తుంది, ʹఅని రతన్గర్ సర్కిల్ అధికారి హిమాన్షు శర్మ అన్నారు.
Keywords : rajastan, Dalit man, assaulted, Jat community, In Rajasthan, Dalit man assaulted, made to drink urine; 8 booked: Police
(2024-04-24 22:47:04)
No. of visitors : 913
Suggested Posts
| నగ్నంగా 2 కిమీ నడిపించి..పసివాళ్ళపై అమానుషం !పసివాళ్ళన్న జాలి...పిల్లలతో పని చేయించకూడదన్న ఇంగిత ఙానం లేని దుర్మార్గులు.... పసివాళ్ళపై అమానుషంగా ప్రవర్తించారు. బట్టలిప్పేసి కొట్టడమే కాకుండా రెండు కిలోమిటర్ల దూరం నగ్నంగా నడిపించారు. పైగా ఆ మొత్తం సంఘటనను వీడియో తీసి షాడిస్టుల్లా ప్రవర్తించారు |
| ఆ హంతకుడే తమ రాముడంటూ ఊరేగించిన మతోన్మాదులుదేశమంతా అసహ్యించుకునే ఓ హంతకుడిని వాళ్ళు దేవుడిలాగా రథంపై ఊరేగించారు. లవ్ జీహాదీ పేరుతో ఓ అమాయకుడిని హత్య చేసి జైల్లో ఉన్న వ్యక్తికి జై జైలు కొడుతూ అతనే మా రాముడంటూ ఊరంతా ఊరేగించారు.... |
| చిన్న పొరపాటుకు చిన్నారికి బహిష్కరణ శిక్ష - కాప్ పంచాయతీ దుర్మార్గంరాజస్తాన్ లోని బండి జిల్లా హరిపుర గ్రామంలో ఓ ఐదేండ్ల బాలిక రెగర్ కమ్యూనిటీకి చెందిన వారు ʹపవిత్రంగా భావించేʹ టైటిహరి అనే పక్షి గుడ్డును పొరపాటున పగులకొట్టింది. ఈ పక్షి గుడ్డును పగులకొడితే.. వర్షాలు పడవని వారి నమ్మకమట. |
| రాజస్తాన్ లో అమెరికా లాంటి ఘటన....వ్యక్తిని కిందపడేసి మోకాలితో తొక్కిన పోలీసులుజార్జ్ ఫ్లాయిడ్ ను చంపిన పోలీసు లాగానే ఓ వ్యక్తి పట్ల ఇక్కడి పోలీసులు ప్రవర్తించారు.
రాజస్తాన్ లో మాస్క్ ధరించకుండా రోడ్డు మీదికి వచ్చాడని ఓ వ్యక్తిపై పోలీసులు దారుణంగా దాడి చేశారు. |