దళితుడు,RTI కార్యకర్తపై దుర్మార్గమైన దాడి - మూత్రం తాగించే ప్రయత్నం


దళితుడు,RTI కార్యకర్తపై దుర్మార్గమైన దాడి - మూత్రం తాగించే ప్రయత్నం

దళితుడు,RTI

28-02-2022

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాలోని ఒక గ్రామ పంచాయతీకి సంబంధించిన సమాచారం కోరినందుకు 33 ఏళ్ల దళిత సమాచార హక్కు (RTI) కార్యకర్తను ఏడుగురు వ్యక్తులు కొట్టి, బలవంతంగా మూత్రం తాగించారని పోలీసులు సోమవారం తెలిపారు. తీవ్రంగా గాయపడిన బాధితుడు శశికాంత్ జాతవ్‌ను స్థానిక‌ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స తర్వాత, తదుపరి చికిత్స కోసం ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) తరలించినట్లు ఒక అధికారి తెలిపారు.

ఫిబ్రవరి 23న జరిగిన ఈ ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

పానిహార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బర్హి గ్రామ పంచాయతీకి సంబంధించిన సమాచారాన్ని శశికాంత్ జాతవ్ సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) కింద కోరినట్లు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదును ఉటంకిస్తూ అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జయరాజ్ కుబేర్ తెలిపారు. దీనిపై కోపోద్రిక్తుడైన బార్హి సర్పంచ్ భర్త, పంచాయతీ కార్యదర్శి, మరికొంతమంది కలిసి ఫిబ్రవరి 23న అతన్ని గ్రామ పంచాయతీ కార్యాలయానికి పిలిచారు. బాధితుడిని మొదట గదిలో బంధించి, ఆపై నిందితులు అతనిపై కులపరమైన వ్యాఖ్యలు కూడా చేసి తీవ్రంగా కొట్టారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం, నిందితులు జాతవ్ ను మూత్రం తాగమని బలవంతం చేశారు.

తీవ్రంగా గాయపడ్డ జాతవ్‌ను మొదట జయరోగ్య హాస్పిటల్ మెడికల్ కాలేజీలో చేర్చారు. తదుపరి చికిత్స కోసం ఢిల్లీలోని ఎయిమ్స్‌కు రిఫర్ చేశారు, బాధితుడి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయడానికి ఒక అధికారిని దేశ రాజధానికి పంపుతామని పోలీసు అధికారి చెప్పారు.

హత్యాయత్నం, అపహరణ, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నిరోధక) చట్టంలోని నిబంధనల ప్రకారం భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ల కింద ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.

ఏడుగురు నిందితులను ఆశా కౌరవ్, సంజయ్ కౌరవ్, ధాము, భూరా, గౌతమ్, వివేక్ శర్మ,సర్నామ్ సింగ్‌లుగా గుర్తించినట్లు అధికారి తెలిపారు.

Keywords : madhyapradesh, dalit, attacked, RTI, Dalit activist beaten up, forced to drink urine in Gwalior
(2023-09-28 02:35:58)



No. of visitors : 962

Suggested Posts


ఆదివాసీ యువతిపై దాడి చేశారు...నగ్నంగా ఊరేగించారు..

ఓ గుంపు ఓ ఆదివాసీ మహిళ పై అనాగరికంగా.... దుర్మార్గంగా... దాడి చేశారు. ఆమె పట్ల అతి నీచంగా ప్రవర్తించారు. మధ్య ప్రదేశ్ లో మంత్రగత్తె అనే నెపంతో ఓ యువతి పట్ల గ్రామస్తులు...

హద్దుల్లేని మత పిచ్చి - మూర్ఖత్వం అనంతం

బ‌స్సో, రైలో, విమానమో నడుపుతున్నది ముస్లిం అని తెలిస్తే మధ్యలో గెంతెయ్యాలి . ఈవీఎం మెషీన్లని తయారుచేసేవాడు ముస్లిమో క్రిస్టియనో అయితే వోటేయ్యడం మానెయ్యాలి. ఇమిగ్రేషన్ కౌంటర్లో వున్నది ముస్లిమో, క్రిస్టియనో అయితే విమానమెక్కకుండా వెనక్కి వచ్చేయాలి. ఇంతకీ క్రిస్టియన్లు కనిపెట్టిన నడుపుతున్న ట్విట్టర్, పేస్బుక్ లను వాడడం మానెయ్యాలి. ముస్లిం దేశాల గాలి సోకకుం

లారీతో తొక్కించి జర్నలిస్ట్ ను హత్య చేసిన ఇసుక మాఫియా

ఈ అవినీతిలో ఉన్న ప్రజా ప్రతినిధుల పేర్లను పూర్తి ఆధారాలతో బయటపెడతానని ఆయన చెప్పారు కూడా. అయితే సోమవారం ఉదయం ఆయన విధులకు వెళ్తున్న క్రమంలో ఓ లారీ ఆయన్ని ఢీ కొట్టింది. వెంటనే లారీ డ్రైవర్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. వారొచ్చి సందీప్‌ను ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.

CPI Maoist Extends Support to Peasants On Strike In Madhya Pradesh

Extending support to the farmersʹ strike in Madhya Pradesh and other states, Outlawed Communist Party of India (Maoist) have dropped pamphlets and put up banners expressing solidarity with the agitating peasants....

దానమడిగినందుకు పసివాణ్ణి తన్నిన మంత్రి

ఓ వీధి బాలుడు దానం అడిగినందుకు ఆ మంత్రికి కోపమొచ్చింది. ఆ బాలుడిని కాలితో తన్ని వెళ్ళి పోయింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వంలోని పశు సంవర్థకశాఖ మంత్రి కుసుమ్ మెహడేలే చేసిన ఈ అమానవీయ చర్య....

ఆర్ఎస్ఎస్ కు భజన చేస్తున్న పోలీసు అధికారులు

ప్రభుత్వ శాఖలను పూర్తిగా కాషాయమయం చేస్తున్నారంటూ విమర్శలు వినవస్తున్న నేపథ్యంలో ఆ విమర్షలను నిజం చేస్తూ మధ్యప్రదేశ్ నార్కోటిక్స్ విభాగం ఓ క్యాలెండర్ ప్రచురించింది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా కొటేషన్లతో పాటు వారి ఫోటోలను ఈ క్యాలెండర్లలో ప్రచురించి ఆర్ఎస్ఎస్ పై భక్తిని చాటుకున్నారు ఆ పోలిసు అధికారులు....

బీజేపీకి వ్యతిరేకంగా వార్తలు రాసినందుకు జర్నలిస్టులపై దుర్మార్గం - అర్ద నగ్నంగా నిలబెట్టిన పోలీసులు

మధ్యప్రదేశ్ లోని సిధి జిల్లాలో స్థానిక బీజేపీ శాసనస‌భ్యుడు కేదార్‌నాథ్ శుక్లాకు వ్యతిరేకంగా వార్తలు రాశారనే కోపంతో ఆయన ఆదేశాలతో పోలీసులు 8 మంది జర్నలిస్టులను అరెస్టు చేశారు. వాళ్ళందరినీ అర్దనగ్నంగా డ్రాయర్లమీద పోలీసు స్టేషన్ లో నిలబెట్టి ఫోటోలు తీశారు. దారుణంగా అవమానించారు. వారిపై అక్రమ కేసు బనాయించారు.

Custodial Violence in MP:లాకప్ లో ఆదివాసులపై చిత్ర హింసలు, యువకుడి మృతి...భగ్గుమన్న ఆదివాసులు

మధ్యప్రదేశ్ ,ఖార్‌గోన్‌లో పోలీసు కస్టడీలో ఓ ఆదివాసీ యువకుడిని తీవ్ర‌ చిత్రహింసలు పెట్టి, హత్య చేసినందుకు నిరసనగా వేలాదిమంది ఆదివాసీలు నిరసన ప్రదర్శన నిర్వహించారు.

లాక్ డౌన్ నిబందనలు బేఖాతరు... ఓ స్వామీజీ అంత్యక్రియలకు హాజరైన‌ ముఖ్యమంత్రి సహా వేలాది మంది జనం

వ్‌ ప్రభాకర్‌ శాస్త్రి పూర్తి ఊపిరితిత్తులు, కిడ్నీ వ్యాధులతో బాధపడుతూ ఆదివారం చనిపోయారు ఆయన అంఅత్యక్రియలు అధికార లాంఛనాలతో జరిగాయి. ఆ అంత్యక్రియల్లో భౌతిక దూరం నిబంధనలను పక్కనపెట్టి వేలాదిగా జనం గుమికూడారు. అంతిమయాత్రలో ముఖ్యమంత్రి శివ్ రాజ్ సింగ్ చౌహాన్, బీజేపీ జాతీయ జనరల్ సెక్రటరీ కైలాశ్ విజయవర్గీయ, మధ్య ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి కమల్

రిలియన్స్ పవర్ దుర్మార్గం....ఇద్దరు మృతి, నలుగురు గల్లంతు

రిలయన్స్ కంపెనీ దుర్మార్గానికి ఇద్దరు మరణించగా నలుగురు వ్యక్తుల ఆచూకీ తెలిఅయడం లేదు. నిబందనలు పాటించకుండా ఓ గ్రామ సమీపంలో విద్యుత్‌ ప్లాంట్‌ బూడిద వ్యర్థాలు కుమ్మరించడంతో ఆ గ్రామంలో అనేక ఇళ్ళు బూడిదతో కప్పబడిపోయాయి

Search Engine

అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
మణిపూర్ లో ప్లాటినం, క్రోమైట్, నికెల్ వంటి ఖనిజ సంపదను దోచుకోవడానికే కుకీల ఊచకోత -మావోయిస్టు పార్టీ
యాభై ఏళ్ల నక్సల్బరీ: కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు
నేటి నుంచి అమర వీరుల సంస్మ‌రణ వారం ప్రారంభం - ఘనంగా జరపాలని మావోయిస్ట్ పార్టీ పిలుపు
త్వరలో...అమరులైన మావోయిస్ట్ పార్టీ సీసీ మెంబర్స్ జీవిత చరిత్రల పుస్తకాలు విడుదల‌
భారత విప్లవోద్యమ నాయకుడు కటకం సుదర్శన్ అమర్ రహే! ‍
RSS, BJP లకు వ్యతిరేకంగా పోరాడుదాం, మహిళా రెజ్లర్లకు మద్దతుగా నిలబడదాం... విప్లవ ఆదివాసీ మహిళా సంఘం
పాలకులకు లొంగిపోయిన‌ విప్లవ‌ద్రోహి గజ్జెల సత్యం రెడ్డిని ఎండగట్టండి... మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మేడే సందర్భంగా మావోయిస్టు పార్టీ లేఖ
అసలు మనుస్మృతి లో ఏముంది? -ఎన్. వేణుగోపాల్
పోలీసులు విమానాల ద్వారా బాంబు దాడులు చేస్తున్నారు, హిడ్మా క్షేమం -మవోయిస్టు పార్టీ ప్రకటన‌
కామ్రేడ్ సిసాన్ స్మృతిలో జనవరి 16న దేశవ్యాప్త కార్యక్రమాలకు మావోయిస్టు పార్టీ పిలుపు!
కాక‌లు తీరిన యోధుడు కామ్రేడ్ ఎస్‌.ఎల్‌.ఎన్ మూర్తి - మావోయిస్టు పార్టీ
more..


దళితుడు,RTI