బీజేపీకి వ్యతిరేకంగా వార్తలు రాసినందుకు జర్నలిస్టులపై దుర్మార్గం - అర్ద నగ్నంగా నిలబెట్టిన పోలీసులు

బీజేపీకి

07-04-2022

మన దేశంలో ప్రజల వైపు నిలబడే జర్నలిస్టులంటే ప్రభుత్వాలకు, నాయకుల కనుసన్నల్లో నడిచే మాఫియాలకు, పోలీసులకు హత్యలు చేసేంత, చిత్రహింసలకు గురి చేసేంత, అక్రమ కేసులతో జైళ్ళలో తోసేంత కోపం. 2021 లో పత్రికా స్వేచ్చ విషయంలో 180 దేశాల్లో భారత్ ర్యాంక్ 142. ఇది మన పక్కనే మిలట్రీ రాజ్యం చేస్తున్న మయన్ మార్ కన్నా దారుణం. బీజేపీ అధికారంలోకి వచ్చిన అతర్వాత జర్నలిస్టులపై దాడులు అనేక రెట్లు పెరగడం ఆందోళనకలిగించే అంశం. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మధ్యప్రదేశ్ లో జరిగిన ఓ దుర్మార్గమైన సంఘటనను చూడాలి.

మధ్యప్రదేశ్ లోని సిధి జిల్లాలో స్థానిక బీజేపీ శాసనస‌భ్యుడు కేదార్‌నాథ్ శుక్లాకు వ్యతిరేకంగా వార్తలు రాశారనే కోపంతో ఆయన ఆదేశాలతో పోలీసులు 8 మంది జర్నలిస్టులను అరెస్టు చేశారు. వాళ్ళందరినీ అర్దనగ్నంగా డ్రాయర్లమీద పోలీసు స్టేషన్ లో నిలబెట్టి ఫోటోలు తీశారు. దారుణంగా అవమానించారు. వారిపై అక్రమ కేసు బనాయించారు.

కనిష్క్ తివారీ అనే జర్నలిస్ట్ బఘేలీలోని తన యూట్యూబ్ ఛానెల్‌లో వార్తలను ప్రసారం చేస్తాడు.. అతని ఛానెల్‌కు ఒకటిన్నర లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు. అతను న్యూస్ నేషన్ ఛానెల్ కు కూడా వార్తలను పంపుతాడు. అతనితో పాటు అరెస్టైన వాళ్ళ‍లో ఎక్కువమంది స్థానికంగా యూట్యూబ్ ఛానళ్ళు నడుపుతారు. వీళ్ళంతా స్థానికంగా బీజేపీ ఎమ్మెల్యే కేదార్‌నాథ్ శుక్లా చేసే అరాచకాలు, అక్రమాలు ఎప్పటికప్పుడు తమ ఛానళ్ళలో బహిర్గతం చేస్తూ ఉంటారు. దీంతో ఈ జర్నలిస్టులను టార్గెట్ చేసిన బీజేపీ ఎమ్మెల్యే వాళ్ళపై కక్షతీర్చుకోవాలనుకున్నాడు అనుకున్నదే తడువుగా ప్పోలీసులకు ఆదేశాకు చేసిపాడేశాడు. పోలీసులు కూడా వెనకా ముందు ఆలోచించకుండా యజమాని చెప్పిందే ఆలస్యం ఆ ఎనిమిది మంది జర్నలిస్టులపై కేసు బుక్ చేసి వాళ్ళను పోలీసు స్టేషన్ కు లాక్కొచ్చి బట్టలు విప్పించి అవమానకరంగా ప్రవర్తించారు. ఫేక్ ఐడీలతో బీజేపీ ప్రభుత్వానికి, ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా వీళ్ళు వార్తలు రాసి చూపిస్తారని పోలీసులు ఆరోపిస్తున్నారు.

ప్రస్తుతం పోలీసు స్టేషన్ లో జర్నలిస్టుల అర్దనగ్న ఫోటో మీడియా ప్రపంచాన్ని కదిలించింది! దేశవ్యాప్తంగా జర్నలిస్టులపై వేధింపులకు వ్యతిరేకంగా ఢిల్లీ ప్రెస్‌క్లబ్‌లో ఒక రోజు ముందే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ మధ్య కాలంలో యూపీలో పేపర్ లీక్ కేసు, ఈవీఎం కేసుల్లో వార్తలు ప్రచురించినందుకు జర్నలిస్టులపై వేధింపులకు గురవుతున్నట్లు వార్తలు వచ్చాయి. దేశంలో జర్నలిస్టులపై అధికార పార్టీల దౌర్జన్యాల‌ పరంపర కొనసాగుతోంది.

ఈ దుర్మార్గ ఘటనపై ప్రముఖ సామాజిక కార్యకర్త హిమాంశు కుమార్ స్పందిస్తూ...

ʹʹజర్నలిస్టులను బట్టలు విప్పి నిలబెట్టే హక్కు పోలీసులకు ఎవరిచ్చారు?
ఒక వ్యక్తి నకిలీ పేరుతో యూట్యూబ్ ఛానెల్ నడిపితే.. కోర్టు విచారించి, శిక్షించాలి.
ఒకరిని శిక్షించే హక్కు పోలీసులకు ఎప్పటి నుంచి వచ్చింది, ఏ చట్టం ప్రకారం?
ఈ దేశంలో కోర్టు లేదు, చట్టం లేదు, రాజ్యాంగం లేదు, బీజేపీ గూండాయిజం మాత్రమే మిగిలి ఉంది.
గంజాయి తాగి ప్రతిపక్షాలు ఎక్కడ నిద్రపోతున్నాయి? జర్నలిస్టు సంస్థలు ఏం చేస్తున్నాయి?ʹʹ అని ప్రశ్నించారు.

Keywords : madhyapradesh, BJP, MLA, Sidhi district, BJP MLA Kedarnath Shukla, Journalist Kanishk Tiwari, Police,MP Police made journalists semi-naked for running news against BJP MLA
(2024-04-22 00:46:54)



No. of visitors : 1714

Suggested Posts


ఆదివాసీ యువతిపై దాడి చేశారు...నగ్నంగా ఊరేగించారు..

ఓ గుంపు ఓ ఆదివాసీ మహిళ పై అనాగరికంగా.... దుర్మార్గంగా... దాడి చేశారు. ఆమె పట్ల అతి నీచంగా ప్రవర్తించారు. మధ్య ప్రదేశ్ లో మంత్రగత్తె అనే నెపంతో ఓ యువతి పట్ల గ్రామస్తులు...

హద్దుల్లేని మత పిచ్చి - మూర్ఖత్వం అనంతం

బ‌స్సో, రైలో, విమానమో నడుపుతున్నది ముస్లిం అని తెలిస్తే మధ్యలో గెంతెయ్యాలి . ఈవీఎం మెషీన్లని తయారుచేసేవాడు ముస్లిమో క్రిస్టియనో అయితే వోటేయ్యడం మానెయ్యాలి. ఇమిగ్రేషన్ కౌంటర్లో వున్నది ముస్లిమో, క్రిస్టియనో అయితే విమానమెక్కకుండా వెనక్కి వచ్చేయాలి. ఇంతకీ క్రిస్టియన్లు కనిపెట్టిన నడుపుతున్న ట్విట్టర్, పేస్బుక్ లను వాడడం మానెయ్యాలి. ముస్లిం దేశాల గాలి సోకకుం

లారీతో తొక్కించి జర్నలిస్ట్ ను హత్య చేసిన ఇసుక మాఫియా

ఈ అవినీతిలో ఉన్న ప్రజా ప్రతినిధుల పేర్లను పూర్తి ఆధారాలతో బయటపెడతానని ఆయన చెప్పారు కూడా. అయితే సోమవారం ఉదయం ఆయన విధులకు వెళ్తున్న క్రమంలో ఓ లారీ ఆయన్ని ఢీ కొట్టింది. వెంటనే లారీ డ్రైవర్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. వారొచ్చి సందీప్‌ను ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.

CPI Maoist Extends Support to Peasants On Strike In Madhya Pradesh

Extending support to the farmersʹ strike in Madhya Pradesh and other states, Outlawed Communist Party of India (Maoist) have dropped pamphlets and put up banners expressing solidarity with the agitating peasants....

దానమడిగినందుకు పసివాణ్ణి తన్నిన మంత్రి

ఓ వీధి బాలుడు దానం అడిగినందుకు ఆ మంత్రికి కోపమొచ్చింది. ఆ బాలుడిని కాలితో తన్ని వెళ్ళి పోయింది. మధ్యప్రదేశ్ ప్రభుత్వంలోని పశు సంవర్థకశాఖ మంత్రి కుసుమ్ మెహడేలే చేసిన ఈ అమానవీయ చర్య....

ఆర్ఎస్ఎస్ కు భజన చేస్తున్న పోలీసు అధికారులు

ప్రభుత్వ శాఖలను పూర్తిగా కాషాయమయం చేస్తున్నారంటూ విమర్శలు వినవస్తున్న నేపథ్యంలో ఆ విమర్షలను నిజం చేస్తూ మధ్యప్రదేశ్ నార్కోటిక్స్ విభాగం ఓ క్యాలెండర్ ప్రచురించింది. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా కొటేషన్లతో పాటు వారి ఫోటోలను ఈ క్యాలెండర్లలో ప్రచురించి ఆర్ఎస్ఎస్ పై భక్తిని చాటుకున్నారు ఆ పోలిసు అధికారులు....

Custodial Violence in MP:లాకప్ లో ఆదివాసులపై చిత్ర హింసలు, యువకుడి మృతి...భగ్గుమన్న ఆదివాసులు

మధ్యప్రదేశ్ ,ఖార్‌గోన్‌లో పోలీసు కస్టడీలో ఓ ఆదివాసీ యువకుడిని తీవ్ర‌ చిత్రహింసలు పెట్టి, హత్య చేసినందుకు నిరసనగా వేలాదిమంది ఆదివాసీలు నిరసన ప్రదర్శన నిర్వహించారు.

లాక్ డౌన్ నిబందనలు బేఖాతరు... ఓ స్వామీజీ అంత్యక్రియలకు హాజరైన‌ ముఖ్యమంత్రి సహా వేలాది మంది జనం

వ్‌ ప్రభాకర్‌ శాస్త్రి పూర్తి ఊపిరితిత్తులు, కిడ్నీ వ్యాధులతో బాధపడుతూ ఆదివారం చనిపోయారు ఆయన అంఅత్యక్రియలు అధికార లాంఛనాలతో జరిగాయి. ఆ అంత్యక్రియల్లో భౌతిక దూరం నిబంధనలను పక్కనపెట్టి వేలాదిగా జనం గుమికూడారు. అంతిమయాత్రలో ముఖ్యమంత్రి శివ్ రాజ్ సింగ్ చౌహాన్, బీజేపీ జాతీయ జనరల్ సెక్రటరీ కైలాశ్ విజయవర్గీయ, మధ్య ప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి కమల్

దళితుడు,RTI కార్యకర్తపై దుర్మార్గమైన దాడి - మూత్రం తాగించే ప్రయత్నం

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ జిల్లాలోని ఒక గ్రామ పంచాయతీకి సంబంధించిన సమాచారం కోరినందుకు 33 ఏళ్ల దళిత సమాచార హక్కు (RTI) కార్యకర్తను ఏడుగురు వ్యక్తులు కొట్టి, బలవంతంగా మూత్రం తాగించారని

రిలియన్స్ పవర్ దుర్మార్గం....ఇద్దరు మృతి, నలుగురు గల్లంతు

రిలయన్స్ కంపెనీ దుర్మార్గానికి ఇద్దరు మరణించగా నలుగురు వ్యక్తుల ఆచూకీ తెలిఅయడం లేదు. నిబందనలు పాటించకుండా ఓ గ్రామ సమీపంలో విద్యుత్‌ ప్లాంట్‌ బూడిద వ్యర్థాలు కుమ్మరించడంతో ఆ గ్రామంలో అనేక ఇళ్ళు బూడిదతో కప్పబడిపోయాయి

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


బీజేపీకి