త్వరలో రాబోతున్న పుస్తకం:మన కాలపు మహత్తర పోరాటం - సిలింగేర్

త్వరలో

09-05-2022

సిలింగేర్‌ పోరాటానికి ఏడాది
మన కాలపు మహత్తర పోరాటం - సిలింగేర్
త్వరలో ముద్ర ప్రచురణగా రాబోతుంది

సిలింగేర్‌.. ఒక ఊరి పేరు. కానీ ఆ పోరాటం ఆ ఊరిదే కాదు. ఆ ఊళ్లో మొదలైంది. నిజానికి ఇలాంటి పోరాటాలు గత ముప్పయ్యేళ్లుగా చాలా పల్లెలు చేస్తున్నాయి. కానీ సిలింగేర్‌లో మొదలైన పోరాటం అనేక గ్రామాలకు అంటుకుంది. పక్క రాష్ట్రానికి చేరుకుంది. ఏడాదిగా కొనసాగుతున్నది. ఎక్కడా అలిసిపోలేదు. లొంగిపోలేదు. ఆరంభం నుంచే పోలీసు కాల్పులు, దాడులు, హత్యలు. అయినా భయపడటం లేదు. ఒక ప్రజాస్వామిక పోరాటం ఎలా ఉండాలో ఆచరణలో రుజువు చేస్తున్నది.
ఇటీవలి ప్రజా పోరాటాల చరిత్రలో డిల్లి రైతుల పోరాటం తర్వాత మళ్లీ అంత విస్తృతి ఉన్నది సిలింగేర్‌ ఉద్యమానికే. ఈ రెంటికీ మధ్య చాలా పోలికలు ఉన్నాయి. తేడాలూ ఉన్నాయి. వీటివి పూర్తి భిన్న నేపథ్యాలు. భిన్న పరిస్థితులు. తరచి చూసే కొద్దీ దగ్గరితనం. రెంటిలోనూ అదే పోరాట చేవ. అదే సంసిద్ధత.

సిలింగేర్‌ చాలా సరళమైన ఉద్యమం అనిపించవచ్చు. ఆదివాసుల పోరాటం గదా అని కొందరైనా చప్పరించవచ్చు. దానికి లోకంతో సంబంధం ఏమున్నదని చేతులు ఎల్లికల వేసే వాళ్లు ఉండవచ్చు. భారత సమాజాన్ని ప్రభావితం చేసే పోరాటం కాదని సిద్ధాంతీకరించేవాళ్లు ఉండవచ్చు. ఆదివాసీ పోరాటం కాబట్టి రొటీన్‌గా ఫీలయ్యేవాళ్లూ ఉండవచ్చు.

నిజంగానే సిలింగేర్‌తో మనకు ఏరకంగా సంబంధం లేదనిపిస్తే దాని మానాన దాన్ని వదిలేయవచ్చు. మనకు కండ్లు మిరమిట్లు గొలిపే లక్షణం ఏమీ లేదనుకుంటే దానితో మనకేం పని? మన హృదయానికి పట్టనప్పడు మన నైతిక, ప్రజాస్వామిక ప్రమాణాలతో దానిని బలపరచవలసిన అవసరమేముంది? వాళ్ల పోరాటమేదో వాళ్లు చేసుకుంటారు. చావో రేవో చూసుకుంటారు. కేవలం ఆదివాసులు కదా అనే వైపు నుంచి సిలింగేర్‌ పోరాటానికి మన సానుభూతి అక్కర్లేదు. ఔదార్యం అవసరం లేదు.
అందుకే నిర్మమకారంగానే ఒకసారి లోపలికి తొంగి చూడండి. విమర్శనాత్మకంగా పరిశీలించండి. అందులో ఉన్న అనేక అంశాలు కనిపిస్తాయి. వాటి సంక్లిష్టత అర్థమవుతుంది. అప్పుడు ఆ పోరాటంలోని అంతర్గత శక్తి తెలుస్తుంది. ఒక ప్రజాస్వామిక పోరాటంగా దాని ప్రత్యేకత అర్థమవుతుంది. దేశ రాజకీయార్థిక వ్యవస్థలో దాని వ్యూహాత్మక స్థానం తెలుస్తుంది. అందులో మనందరి పోరాటం అనదగిన లోతు కనిపిస్తుంది.

ఆదివాసీ ప్రాంతాల్లో సైనిక క్యాంపులు ఎత్తేయాలనే డిమాండ్‌తో ఈ ఉద్యమం నడుస్తున్నది. చాలా చిన్న కోరిక కదా? కానీ మనందరి డిమాండ్ల ప్రతిధ్వనిగా రాటుదేలుతున్నది. కేవలం పెసా చట్టం అమలు చేస్తే సద్దుమణిగే రాజ్యాంగబద్ధ పోరాటమే కదా? కానీ రాజ్య వ్యతిరేక, వ్యవస్థా వ్యతిరేక, కార్పొరేట్‌ వ్యతిరేక విప్లవ ప్రత్యామ్నాయ విస్తృతిని ప్రతిబింబిస్తున్నది.

ఇదీ సిలింగేర్‌ ప్రత్యేకత. అందుకే అది ఒక ఊరి పోరాటం కాదు. ఏడాదిగా సాగుతున్న పోరాటం మాత్రమే కాదు. బహుశా అనేక పొరలుగా, అనేక అర్థాలతో అనేక తీరాలకు చేరగల పోరాటం. కొంచెం ఓపిగ్గా తెలుసుకోవలసిన పోరాటం. మనందరం సొంతం చేసుకోవాల్సిన పోరాటం.

కాపీల కోసం సంప్రదించండి
పాణి విరసం
9866129458

Keywords : silinger struggle, chattis garh, adivasi, crpf, book release
(2024-04-24 22:29:33)



No. of visitors : 784

Suggested Posts


కలకత్తాలో జరుగుతున్న చారుమజుందార్ శత జయంతి ఉత్సవాల్లో విరసం కార్యదర్శి పాణి స్పీచ్

నక్సల్బరీ లేకపోతే భారత పీడిత ప్రజానీకానికి విప్లవ‌ దారే లేకుండా పోయేది. కమ్యూనిస్టు రాజకీయాలు చర్చించుకోవడానికే తప్ప వర్గపోరాట బాట పట్టకపోయేవి. ఆ నక్సల్బరీ దారిని చూపినవాడు చారు మజుందార్. విప్లవ పార్టీకి వ్యూహాన్ని, ఎత్తుగడలను ఒక సాయుధ పోరాట మార్గాన్ని చూపించిన వాడు చారు మజుందార్.

ఆదివాసి.. లంబాడా వివాదం ‍- ఎం.రత్నమాల

మహారాష్ట్ర ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి తెగగా గుర్తించడం లేదు కనుక ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి షెడ్యూల్డు తెగగా ప్రకటించడంతో దీన్ని అవకాశంగా తీసుకుని మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌ (పాత) జిల్లాకు లంబాడాల వలసలు పెద్ద ఎత్తున వెల్లువలా సాగాయి.....

మహాశ్వేతా దేవి - మన తెలంగాణ సాగర హారంః వరవర రావు

మన మహా సాగరహారం ʹచలో హైదరాబాద్ అంటూ తెలంగాణ మార్చ్ చేసిన సెప్టెంబర్ 30, 2012 మహత్తర మధ్యాహ్నం మహాశ్వేతాదేవి కూడా మన ఊర్లో ఉన్నారు. ఆ రోజు ఆమెను మన మధ్యకు తెచ్చుకొని ఉంటే....

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

1947 ఆగస్ట్ 15న విలీనానికి అంగీకరించకుండా షరతులు విధిస్తూ వచ్చిన నిజాంను నెహ్రూ - పటేల్ ప్రభుత్వం సగౌరవంగా, సాదరంగా చర్చలకు ఆహ్వానించింది. అప్పటికే నిజాంను వ్యతిరేకిస్తూ వీరోచిత పోరాటం నడుపుతున్న కమ్యూనిస్టులను మాత్రమే కాదు, కనీసం కాంగ్రెస్ ను కూడా ఈ చర్చల్లో భాగం చేయలేదు....

అమరుడు బొజ్జా తారకం — ʹనది పుట్టిన గొంతుకʹ - వరవరరావు

గోదావరి తెలంగాణలో ప్రవేశించిన నిజామాబాద్ కు 1968లో వచ్చిన తారకం గారు ఇక్కడి మట్టిలోని ఎరుపులోనూ, ఇక్కడి నీళ్లలోని ప్రవాహ గుణంలోనూ కలగలిసిపోయారు. 1968 నుంచి 78 దాకా ఒక దశాబ్దం పాటు విప్లవోద్యమాలకు, విప్లవ సాహిత్యానికి నిజామాబాద్ చిరునామా బొజ్ఞాతారకం....

ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పోరాటానికి విరసం మద్దతు

అట్టడుగున ఉన్న మనిషికి ఫలితాలు అందినప్పుడే సామాజిక న్యాయం జరిగినట్టు లెక్క. మాదిగ, డక్కలి, చిందు, మాష్టి, బుడగజంగం, దాసరి, బేగరి కులాలకు ఈ నాటికీ ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు....

ʹఅన్నలు మల్లొస్తరు బిడ్డా.. ఆల్లొస్తే వాళ్ళకు గిన్ని మంచి నీల్లో, తిండో పెట్టాలనే బతుకుతాన్నʹ

అందుకే అంత నిర్బంధంల కూడా నా కొడుకు అంత్యక్రియలకు వచ్చిన జనాలకు మా ఖిలా వరంగల్ సరిపోలె. ఎక్కడోల్లను అక్కడ అరెస్ట్ చేసినా వచ్చిండ్రు. ఎవరో నక్సలైట్ అట, చిన్న పిల్లగాడేనట, బలే తెలివికల్లోడట అని అనుకుంట జనాలు వచ్చిండ్రు. పద్దెనిమిది నిండి పందొమ్మిది పడగానే చంపేసిండ్రు.

కాగడాగా వెలిగిన క్షణం... అమరుడు యెం యెస్ ఆర్ కోసం ... నారాయణ స్వామి

ఎంత ప్రాణం శ్రీనుది బక్క పలుచగా ఉండేటోడు – ఎక్కడన్న సరిగ్గా తిన్నడో లేదో శరీరం లో బలం సత్తువ ఉన్నదో లేదో – ఆ దుర్మార్గులు పట్టుకొని చిత్రహింసలు పెడుతుంటే ఆ లేత శరీరం ఎంత గోస పడిందో ఎంత హింసకు గురైందో ఎంత అల్లల్లాడిందో – ఆ క్రూరులు చంపేయ్యబోతుంటే, చివరికి మేఘే ఢాకా తార లో సుప్రియ అరిచినట్టు నాకు బతకాలని ఉంది నాకు చావాలని లేదు నాకు బతకాలని ఉంది....

ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల‌

అంతకుముందు అంతర్జాతీయ శ్రామికవర్గ పతాకావిష్కరణతో కార్యక్రమాలను ప్రారం భించారు. అమరుడు పులి అంజన్న తల్లి సైదమ్మ ఎర్ర జెండాను, సీనియర్ విరసం సభ్యురాలు రత్నమాల విప్లవ రచయితల సంఘం జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా అమరుడు శేషయ్య సోదరుడు సాంబయ్య, అమరుడు వివేక్ తండ్రి యోగానంద్ అమరుల స్థూపాన్ని ఆవిష్క రించారు.

ʹఅరుణోదయʹ పై పోలీసుల దాడిని ఖండించిన విరసం

తెలంగాణ ఉద్యమంలో ఆట పాటతో ఆరుణోదయ కళాకారులు గ్రామ గ్రామాన తిరిగి ప్రజల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ వంతు కృషి చేశారు. ఆ సంస్థ కార్యాలయాన్ని దౌర్జన్యంగా మూసేయడం అత్యంత నిరంకుశమైన......

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


త్వరలో