భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నంలో భాగమే ʹఅగ్నిపథ్ʹ -మావోయిస్ట్ పార్టీ
19-06-2022
(కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకంపై భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ప్రకటన పూర్తి పాఠం...)
సైన్యాన్ని నాజీకరించే, పౌర సమాజాన్ని సైనికీకరించే కేంద్ర ప్రభుత్వ అప్రజాస్వామిక, రాజ్యాంగ వ్యతిరేకʹఅగ్నిపథ్ʹ పథకానికి వ్యతిరేకంగా పోరాడుదాం!
భారత సైన్య త్రివిధ బలగాలలోకి యువతను కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేసుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ నూతన ʹఅగ్నిపథ్ʹ పథకాన్ని, అందుకు వ్యతిరేకంగా పది రాష్ట్రాలకు వ్యాపించిన, బిహార్ రాష్ట్రంలో రైల్వేల ధ్వంసం మొదలయిన సంఘటనలతో జరుగుతున్న ప్రజల అందోళనలపై తెలంగాణా రాష్ట్రం సికిందరాబాద్ ప్రాంతంలో కాల్పులలో వరంగల్ కు చెందిన రాకేష్ అనే వ్యక్తి మరణానికి, పలువురికి గాయాలకూ దారి తీసిన ప్రభుత్వ అణచివేత వైఖరినీ భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్ర కమిటీ అత్యంత తీవ్రంగా ఖండిస్తున్నది. ఇది సైన్యాన్ని ఫాసిస్టీకరించే, పౌర సమాజాన్ని విచ్ఛిన్నం చేసి సైనికీకరించే పథకం.
బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు భారతీయ జనతా పార్టీ మోదీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చిన గడచిన 8 సంవత్సరాల రెండు దఫాల పాలనలో దేశంలో యావత్తు రంగాలనూ ఫాసిస్టీకరణ చేస్తూ వస్తున్నది. జూన్ 14వ తేదీన ప్రకటించిన, సైన్యంలోకి భర్తీ పథకంగా ముందుకు తీసుకువచ్చిన ʹఅగ్నిపథ్ʹ ఉద్యోగ కల్పన పేరుతో దేశ ప్రజలపై ఫాసిస్టు అణచివేత సాధనమే.
ప్రజా వ్యతిరేక, సామ్రాజ్యవాద అనుకూల విధానాల వల్ల ప్రపంచంలోను, దేశంలోనూ రోజు రోజుకూ నిరుద్యోగం పెరుగుతున్నది. పర్మనెంటు ఉద్యోగాలు లేవు. ఈ పరిస్థితులలో మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన ʹఅగ్నిపథ్ʹలో చేరడం యువతను బలవంతంగా భర్తీ చేసుకోవడమే అవుతుంది. ఎల్ పీజీలో భాగంగా, ప్రభుత్వ వ్యయాన్ని కనిష్టం చేయాలన్న ప్రపంచ బ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్య నిధి షరతులకు లోబడి జరుగుతున్నది. సైన్యంలో వేతనాలు, భారీ ఫించనుల ఖర్చును తగ్గించేందుకే ఈ ʹటూర్ అన్ డ్యూటీʹ పథకాన్ని తీసుకువచ్చామని ప్రభుత్వం బహిరంగంగానే ప్రకటించింది.
ప్రపంచవ్యాప్తంగా సామ్రాజ్యవాదుల మధ్య పోటీ సాయుధ ఘర్షణల రూపం తీసుకుంటున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ముందుకు తీసుకువచ్చింది. అంతర్జాతీయ రాజకీయాలలో భారతదేశం ఎంత చురుకుగా వ్యవహరించబోతున్నదో ఇది తెలియజేస్తుంది. యుక్రెయిన్ పై రష్యా దురాక్రమణ యుద్ధ పరిణామాలలో ఇది ఒక భాగం. ఆర్థిక సంక్షోభం కారణంగా పెరుగుతున్న దైనందిన జీవిత సమస్యలతో ప్రజలలో పెరుగుతున్న అశాంతిని, కార్మిక, కర్షక, దళిత, అదివాసీ,జాతుల పోరాటాలను అణగదొక్కడానికి, ప్రత్యేకంగా భారతదేశంలో వర్గ పోరాటాన్ని, ప్రజాయుద్ధాన్ని నిర్మూలించడానికి ప్రభుత్వం అత్యంత కుట్రపూరితంగా ఈ పథకం ముందుకు తీసుకువచ్చింది. స్థానిక యువతకు ప్రాధాన్యత ఇవ్వడంలో భాగంగా ఛత్తీస్ గఢ్ లో అదివాసీ యువతను పోలీసు బలగాలలోకి తీసుకునే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమయింది. భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నం ఇది.
మొదటి 90 రోజులలో 46,000 మందిని భర్తీ చేసుకుంటామని, నాలుగేళ్ల పాటు ప్రత్యేక శిక్షణను అందించి అందులో 25 శాతం మందిని సైన్యంలోకి తీసుకుని మిగిలిన 75 శాతానికి మనిషికి 11.71 లక్షల రూపాయలు ఇచ్చి, ఫించన్ వంటి మరే రకమైన సౌకర్యాలూ లేకుండా పంపించివేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. నాలుగేళ్ల కాలంలో వారి వేతనాలలో కోత ద్వారా జమ చేసే 5.50 లక్షల రూపాయలకు అంతే మొత్తం ప్రభుత్వం కలుపుతుంది. ఈ పథకంలో శిక్షణ పొందేవారు ʹఅగ్నివీర్ʹలంటున్నారు. ఇది ప్రజలపై క్రూర అణచివేతను అమలు చేసే ఎస్ పీఓ, డీఆర్డీ వంటి బలగమే తప్ప మరొకటి కాదు. పైపైనే అయినా దీనిని వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాలకు జవాబుగా, యువతను ప్రేరేపించే ప్రయత్నంగా, ఈ 75 శాతాన్ని వివిధ పరిశ్రమలలోకి తీసుకుంటారని, ఈ పథకం ద్వారా దేశంలో సుశిక్షితమైన సైన్యం తయారవుతుందని కేంద్ర మంత్రులు వివిధ రకాలుగా ప్రకటనలు ఇస్తున్నారు. భాజపా పాలిత రాష్ట్ర ప్రభుత్వాలైన ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ లు ఈ శిక్షణ పొంది తిరిగి వచ్చిన వారికి పోలీసు బలగాలలోకి తీసుకునేందుకు ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించాయి.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్), భాజపాల సిద్దాంత, భావజాల శిక్షణకు, ఈ రకంగా ʹనయా భారత్ʹ పేరుతో భారతదేశాన్ని ʹహిందూ రాజ్యంʹగా రూపొందించే తమ ఎజెండాకు ఈ పథకం తోడ్పడుతుంది. ʹవన్ నేషన్, వన్ ఎవ్రీథింగ్ʹ అన్న నినాదంతో దేశాన్ని ఫాసిస్టు ఏకీకృత పద్ధతిలో రూపొందించేందుకు, దేశంలో కార్మికులు, కర్షకులు, మధ్య తరగతి వంటి పీడిత వర్గాలను, వారికి నాయకత్వం వహిస్తున్న విప్లవ పార్టీని, విప్లవకారులను, ప్రశ్నించే ప్రతి గొంతునూ అణచివేసేందుకు ఒక విస్తృత సైన్యం తయారవబోతున్నది. ఇప్పుడీ పథకం దేశాన్ని ʹవన్ నేషన్, వన్ పోలీస్ʹ దిశగా తీసుకుపోతుంది.
అత్యంత దూకుడుగా తమ ఎజెండాను ముందుకు తీసుకువెళుతున్న బ్రాహ్మణీయ హిందుత్వ శక్తులు దేశ రాజ్యాంగ నియమాలను కానీ పార్లమెంటరీ వ్యవస్థ నిబంధనలను గానీ పాటించకుండా, కనీస గణతంత్ర స్వభావాన్ని దృష్టిలోకి తీసుకోకుండా కనీసం ప్రతిపక్షాలను సంప్రతించకుండా ఈ పథకాన్ని ప్రకటించాయి. దీని వల్ల కేంద్ర-రాష్ట్ర సంబంధాలు ప్రభావితం అవుతాయి.
ఈ ఫాసిస్టీకరణ పథకం లోతులను అర్థం చేసుకుని దాన్ని ప్రజలలో విస్తృతంగా ప్రచారం చేసి, ʹఅగ్నిపథ్ʹ పథకాన్ని వెనక్కు తీసుకోవలసిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయవలసిందిగాను, ఈ పథకానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసననోద్యమాన్ని సామ్రాజ్యవాద వ్యతిరేక, దళారీ నిరంకుశ పెట్టుబడిదారీ వ్యతిరేక, భూస్వామ్య వ్యతిరేక మహా ఉద్యమంగా మలచవలసిందిగానూ మా పార్టీ కేంద్ర కమిటీ దేశ యావత్తు పీడిత వర్గాలు, పీడిత సెక్షన్లు, పీడిత జాతులకు పిలుపునిస్తున్నది. దేశ ప్రజలకు వ్యతిరేకమైనటువంటి ʹఅగ్నిపథ్ʹలో చేరవద్దని దేశ యువతకు విజ్ఞప్తి చేస్తున్నది.
అభయ్
అధికార ప్రతినిధి
కేంద్ర కమిటీ
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)
Keywords : agneepath, agneeveer, cpi maoist, abhay
(2025-03-15 15:25:10)
No. of visitors : 2528
Suggested Posts
| పాలకులకు లొంగిపోయిన విప్లవద్రోహి గజ్జెల సత్యం రెడ్డిని ఎండగట్టండి... మావోయిస్టు పార్టీ ప్రకటనవిడుదల తర్వాత ఆర్.టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా ఆయన తన లొంగుబాటునూ, రాజకీయ పతనాన్ని నిస్సిగ్గుగా బయటపెట్టుకున్నాడని ,మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ అన్నారు. |
| జంపన్నలేఖకు మావోయిస్టు అభయ్ జవాబు - లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ
జూన్ 18న సీ.పీ.ఐ (మావోయిస్టు) అధికార ప్రతినిధిగా నేను ʹకొరోనాతో మావోయిస్టుల మరణం ఒక బూటకం, అది కేవలం పోలీసుల సృష్టిʹ అనే పత్రికా ప్రకటనను ఇచ్చాను. ఇందులో జంపన్నపై ʹవిప్లవ రాజకీయాల నుండి హీనాతిహీనంగా దిగజారిపోయిన |
| PLGA సావనీర్ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ - అభయ్ ఆడియో ప్రకటనపీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ PLGA ఏర్పడి 20 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా సీపీఐ మావోయిస్టు ఓ సావనీర్ విడుదల చేసింది. 20 ఏళ్ళ వేడుకల సందర్భంగా ఈ సావనీర్ విడుదల చేసినట్టు |
| అమ్మా! నను మన్నించు.. తల్లి మరణంపై మావోయిస్టు నాయకుడు వేణుగోపాల్ లేఖ!మల్లోజుల కుటుంబంతో, పెద్దపల్లి పట్టణంతో వందేళ్ల నీ రుణం తీర్చుకున్నావా అమ్మా! నీ కడుపున పుట్టిన ఆరుగురి సంతానంలో నేనే చివరివాన్ని తల్లీ. నిను చివరి వరకు ఏడ్పించిన వాన్నీ నేనే అమ్మా. |
| పోలీసు చిత్రహింసల వల్ల రెండేళ్ళు కోమాలో ఉండి అంతిమ శ్వాస విడిచిన చింతన్ దా కు విప్లవ జోహార్లు -మావోయిస్టు పార్టీసీపీఐ (మావోయిస్టు) కేంద్రకమిటీ సభ్యులు కామ్రేడ్ నరేంద్ర సింగ్ (అశోదా, చింతన్ దా) ఒక పట్టణంలోని ఆసుపత్రిలో 2020 జనవరి 6న అంతిమశ్వాస విడిచారు. ఆయన దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 2018 నుంచి కోమాలో ఉన్నారు. ఆయన వయసు 74 సంవత్సరాలు. |
| Chhattisgarh:ఆయుధాలు వదిలి చర్చలకు రావాలన్న సీఎం పిలుపుకు మావోయిస్టుల జవాబుమావోయిస్టులు ఆయుధాలు వదిలేసి చర్చలకు రావాలని చత్తీస్ గడ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ మాట్లాడిన నేపథ్యంలో ఆ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. తాము కూడా చర్చలకు సిద్దమే అని |
| 11 మంది రేపిస్టుల విడుదలపై మావోయిస్టు పార్టీ ప్రకటన2002 గుజరాత్ అల్లర్లలో బిల్కిస్ బానో ను అత్యాచారం చేసి 14 మందిని హత్య చేసిన దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడాన్ని CPI (మావోయిస్ట్) కేంద్ర కమిటీ ఖండిస్తోంది. |
| గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ గద్దర్ మరణం మమ్మల్ని తీవ్రంగా భాదకు గురి చేసింది. మా సంతాపాన్ని, కుటుంబానికి మా సానుభూతి తెలియ జేస్తున్నాము. |
| మా నాయకత్వానికి కరోనా సోకి, లొంగిపోతున్నారన్న ప్రచారం ఓ కట్టుకథ -మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటనఅనేక మంది మావోయిస్టులకు కరోనా సోకిందని, అందువల్ల అనేక మంది మావోయిస్టులు లొంగిపోనున్నారని పోలీసులు చేస్తున్న ప్రచారాన్ని మావోయిస్టు పార్టీ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి కథలు సృష్టించడంలో ఉభయ తెలుగు రాష్ట్రాల పోలీసు బాస్ లు మహా నేర్పరులని ఆ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. |
| తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శన్ స్తూపావిష్కరణవేలాది ఎర్రని జెండాలతో దండకారణ్యం ఎర్రబడింది. వేల మంది ప్రజల నినాదాలతో దండకారణ్యం దద్దరిల్లింది. అమరవీరుల వారోత్సవాల సందర్భంగా చత్తీస్గడ్ తెలంగాణ బార్డర్లో మావోయిస్టు పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. |