ఈ ఆదీవాసీ శ్రేయోభిలాషులను కాపాడుకుందాం...మావోయిస్టు పార్టీ పిలుపు
05-08-2022
తీస్తా సెతల్వాద్, మహ్మద్ జుబేర్, హిమాంశుకుమార్, రూపేశ్ కుమార్ ల అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా పొరాడాలని సీపీఐ మావోయిస్టు పిలిపినిచ్చింది. విశ్వ మూలవాసీ దినం అయిన ఆగస్టు9వ తేదీన దేశవ్యాప్తంగా గళమెత్తుతాదని మావోయిస్టు పార్టీ మధ్య రీజినల్ బ్యూరో అధికార ప్రతినిధి ప్రతాప్ ఓ ప్రకటనలో ప్రజలను కోరారు. ఆ ప్రకటన పూర్తి పాఠం...
హిందుత్వ శక్తుల కక్ష సాధింపు చర్యలలో భాగమే ప్రజాస్వామికవాదులకు శిక్షలు
కామ్రేడ్స్, మితృలు తీస్తా సెతల్వాద్, మహ్మద్ జుబేర్, హిమాంశుకుమార్, రూపేశ్ లు ఒంటరిగా లేరు. మీతో మేమంతా వున్నం .
గడిచిన రెండు మాసాలుగా దేశంలో కక్షసాధింపు చర్యలు వేగంగా జరిగిపోతున్నాయి. హిందుత్వ శక్తుల అసహిష్ణుతకు ఇవి తాజా వుదాహరణలు. ఒకవైపు 2002 లో గుజరాత్ లో వేలాది మంది ముస్లిం సోదరుల మారణకాండకు కారకులైన మోదీకి క్లీన్ చిట్ ఇచ్చి మరోవైపు దోషులను శిక్షించాలని కోర్టును కోరిన సామాజిక కార్యకర్త తీస్తా సీతల్వాడ్ కు శిక్ష విధించడం, అలాగే 2009 ఆపరేషన్ గ్రీన్ హంట్ సమయంలో దంతెవాడ జిల్లాలో పోలీసులు ఒక బూటకపు ఎన్ కౌంటర్ లో 16 మందిని కాల్చి చంపిన నరసంహారంపై స్వతంత్ర దర్యాప్తును కోరిన ప్రముఖ గాంధేయవాది, ఆదివాసీ హితైషీ మితృలు హిమాంశు కుమార్ పిటిషన్ ను కొట్టివేయడమే కాకుండా దేశ అత్యున్నత న్యాయస్థానం ఆయనకు రూ. 5 లక్షల జరిమానా విధించింది. అది చెల్లించని పక్షంలో ఆయన రెండేళ్లు జైలు శిక్ష అనుభవించాలని తీర్పు విన్పించింది. ఆల్ట్ న్యూస్ జర్నలిస్ట్ మహమ్మద్ జుబేర్ 2018లో చేసిన ఒక ట్వీట్ మీద దాఖలు చేసిన కేసులో జూన్ లో జుబేర్ ను నాలుగేళ్ల తరువాత అరెస్టు చేశారు. ఇటీవలే ఝార్ఖండ్ లో స్వతంత్ర పాత్రికేయులు రూపేశ్ కుమార్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ చర్యలన్నీ హిందుత్వ శక్తల కక్షసాధింపు చర్యలలో భాగంగా రాజ్యం కొనసాగిస్తున్నది. ఈ చర్యలను మా పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) మధ్య రీజినల్ బూరో తీవ్రంగా ఖండిస్తున్నది.
మితృలు హిమాంశు కుమార్ తాను నిర్దోశినని తన ఆత్మసాక్షిగా నమ్ముతున్నందుకే, ఆయన జుర్మానా చెల్లించకుండా తీవ్రమైన అనారోగ్య పరిస్థితులలో సైతం రెండేళ్ల జైలు శిక్షకు సిద్ధమయ్యాడు. ఆయన భారత పాలకవర్గాల ఆగడాలను ప్రశ్నిస్తున్నాడు. ఆయన వరుసగా తన ఫేస్ బుక్ డైరీలో పాలకవర్గాలను నిలదీస్తున్నాడు. ఈ దేశ మూలవాసులకు ఒక విశ్వసనీయమైన మితృడిగా వున్నాడు. ఆయన తనను జగ్గల్ పుర్ జైలులో ఆదివాసుల మధ్య వుంచాలనీ, తన శేష జీవితాన్ని వారి మధ్యనే గడిపే అవకాశాన్నివ్వాలని కోరుతున్నాడు.
కానీ, ఆయనను మనం కాపాడుకుందాం. ఆయన నిర్దోశి. ఈ దేశ మూలవాసులు ఇప్పటికే రాజ్యం కుట్రలకు విశ్వసనీయమైన ఆప్తున్ని ఫాదర్ స్టాన్ స్వామిని కోల్పోయారు.
హిమాంశును అలా కానివ్వకూడదు. ఆయనపై విధించిన సుప్రీం కోర్టు ఫైన్ ను రద్దు చేయాలనీ దంతెవాడ నుండి దిల్లీ వరకు గళమెత్తుతున్న వారితో మనమంతా సమైక్యమై విశ్వ మూలవాసీ దినం (9 ఆగస్టు) రోజు మరింత గట్టిగా నినదిద్దాం.
పాత్రికేయ మితృడు రూపేశ్ కుమార్ ఈ దేశపు అడవులు కార్పొరేటీకరణ, సైన్యీకరణకు నిలయంగా మారుతున్నాయనీ దానిని వ్యతిరేకించాలనీ దృఢంగా నిలిచి వుద్యమిస్తున్నాడు. గత కొద్ది సంవత్సరాలుగా ముఖ్యంగా దేశంలో కొనసాగుతున్న ఆపరేషన్ సమాధాన్ సైనిక కేంపెయిన్ లో భాగంగా ఆదివాసీ శ్రేయోభిలాషులను తప్పుడు కేసులలో నిర్బంధించడం తీవ్రతరం, వేగవంతమవుతోంది. 2018లో గడ్ చిరోలీ జిల్లా (మహారాష్ట్ర)కు చెందిన మహేశ్ రావుత్ ను, నాగపుర్ కు చెందిన న్యాయవాది సురేంద్ర గడ్లింగ్, ఛత్తీస్ గఢ్ ఆదివాసీల పక్షాన దృఢంగా నిలిచిన సుధా భరద్వాజ్, ఝార్ఖండ్ మూలవాసులకు అత్యంత ఆప్తుడు ఫాదర్ స్టాన్ సామి మున్నగువారిని అనేక మందిని భీమా కోరేగాం తప్పుడు కేసులో ఇరికించి జైలు పాలు చేసిన విషయం విదితమే. ఈ దేశ అడవులను హస్తగతం చేసుకోవడానికి కార్పొరేట్ వర్గాలు చేస్తున్న కుట్రలను, దాడులను ప్రశ్నించే గొంతులను అణచివేయడానికి వ్యతిరేకంగా సమరశీల పోరాటాలకు వుద్యమించాలనీ, ఈ దేశ అడవులను, ప్రజలకు అండగా నిలిచిన ప్రజాస్వామిక శక్తులను, ఆదివాసీ శ్రేయోభిలాషులను కాపాడుకోవడానికి మరింత సమరశీల పోరాటాలకు నడుం బిగిస్తామని విశ్వ మూలవాసీ దినం నాడు నినదించాలనీ మా బ్యూరో మూలవాసీ ప్రజలకు పిలుపునిస్తున్నది.
విప్లవాభివందనాలతో
ప్రతాప్,
అధికార ప్రతినిధి
మధ్య రీజినల్ బ్యూరో,
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు)
Keywords : cpi maoist, himanshu kumar, rupesh kumar, teesta setalvad,mohammed zubair
(2023-09-28 20:28:27)
No. of visitors : 1510
Suggested Posts
| జంపన్నలేఖకు మావోయిస్టు అభయ్ జవాబు - లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ
జూన్ 18న సీ.పీ.ఐ (మావోయిస్టు) అధికార ప్రతినిధిగా నేను ʹకొరోనాతో మావోయిస్టుల మరణం ఒక బూటకం, అది కేవలం పోలీసుల సృష్టిʹ అనే పత్రికా ప్రకటనను ఇచ్చాను. ఇందులో జంపన్నపై ʹవిప్లవ రాజకీయాల నుండి హీనాతిహీనంగా దిగజారిపోయిన |
| పాలకులకు లొంగిపోయిన విప్లవద్రోహి గజ్జెల సత్యం రెడ్డిని ఎండగట్టండి... మావోయిస్టు పార్టీ ప్రకటనవిడుదల తర్వాత ఆర్.టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా ఆయన తన లొంగుబాటునూ, రాజకీయ పతనాన్ని నిస్సిగ్గుగా బయటపెట్టుకున్నాడని ,మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ అన్నారు. |
| PLGA సావనీర్ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ - అభయ్ ఆడియో ప్రకటనపీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ PLGA ఏర్పడి 20 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా సీపీఐ మావోయిస్టు ఓ సావనీర్ విడుదల చేసింది. 20 ఏళ్ళ వేడుకల సందర్భంగా ఈ సావనీర్ విడుదల చేసినట్టు |
| పోలీసు చిత్రహింసల వల్ల రెండేళ్ళు కోమాలో ఉండి అంతిమ శ్వాస విడిచిన చింతన్ దా కు విప్లవ జోహార్లు -మావోయిస్టు పార్టీసీపీఐ (మావోయిస్టు) కేంద్రకమిటీ సభ్యులు కామ్రేడ్ నరేంద్ర సింగ్ (అశోదా, చింతన్ దా) ఒక పట్టణంలోని ఆసుపత్రిలో 2020 జనవరి 6న అంతిమశ్వాస విడిచారు. ఆయన దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 2018 నుంచి కోమాలో ఉన్నారు. ఆయన వయసు 74 సంవత్సరాలు. |
| అమ్మా! నను మన్నించు.. తల్లి మరణంపై మావోయిస్టు నాయకుడు వేణుగోపాల్ లేఖ!మల్లోజుల కుటుంబంతో, పెద్దపల్లి పట్టణంతో వందేళ్ల నీ రుణం తీర్చుకున్నావా అమ్మా! నీ కడుపున పుట్టిన ఆరుగురి సంతానంలో నేనే చివరివాన్ని తల్లీ. నిను చివరి వరకు ఏడ్పించిన వాన్నీ నేనే అమ్మా. |
| Chhattisgarh:ఆయుధాలు వదిలి చర్చలకు రావాలన్న సీఎం పిలుపుకు మావోయిస్టుల జవాబుమావోయిస్టులు ఆయుధాలు వదిలేసి చర్చలకు రావాలని చత్తీస్ గడ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ మాట్లాడిన నేపథ్యంలో ఆ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. తాము కూడా చర్చలకు సిద్దమే అని |
| మా నాయకత్వానికి కరోనా సోకి, లొంగిపోతున్నారన్న ప్రచారం ఓ కట్టుకథ -మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటనఅనేక మంది మావోయిస్టులకు కరోనా సోకిందని, అందువల్ల అనేక మంది మావోయిస్టులు లొంగిపోనున్నారని పోలీసులు చేస్తున్న ప్రచారాన్ని మావోయిస్టు పార్టీ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి కథలు సృష్టించడంలో ఉభయ తెలుగు రాష్ట్రాల పోలీసు బాస్ లు మహా నేర్పరులని ఆ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. |
| 11 మంది రేపిస్టుల విడుదలపై మావోయిస్టు పార్టీ ప్రకటన2002 గుజరాత్ అల్లర్లలో బిల్కిస్ బానో ను అత్యాచారం చేసి 14 మందిని హత్య చేసిన దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడాన్ని CPI (మావోయిస్ట్) కేంద్ర కమిటీ ఖండిస్తోంది. |
| భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నంలో భాగమే ʹఅగ్నిపథ్ʹ -మావోయిస్ట్ పార్టీ
భారత సైన్య త్రివిధ బలగాలలోకి యువతను కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేసుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ నూతన ʹఅగ్నిపథ్ʹ పథకాన్ని, అందుకు వ్యతిరేకంగా పది రాష్ట్రాలకు వ్యాపించిన, బిహార్ రాష్ట్రంలో రైల్వేల ధ్వంసం మొదలయిన సంఘటనలతో జరుగుతున్న ప్రజల అందోళనలపై తెలంగాణా రాష్ట్రం సికిందరాబాద్ ప్రాంతంలో కాల్పులలో వరంగల్ కు చెందిన రాకేష్ అనే వ్యక్తి మరణానికి, |
| గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది -మావోయిస్టు పార్టీ గద్దర్ మరణం మమ్మల్ని తీవ్రంగా భాదకు గురి చేసింది. మా సంతాపాన్ని, కుటుంబానికి మా సానుభూతి తెలియ జేస్తున్నాము. |