పాండు నొరోటి హత్యకు వ్యతిరేకంగా,రాజకీయ ఖైదీల విడుదలకు దేశవ్యాప్త ఆందోళనలు - మావోయిస్టు పార్టీ పిలుపు


పాండు నొరోటి హత్యకు వ్యతిరేకంగా,రాజకీయ ఖైదీల విడుదలకు దేశవ్యాప్త ఆందోళనలు - మావోయిస్టు పార్టీ పిలుపు

పాండు

12-09-2022

నాగ్ పూర్ జైల్లో అనారోగ్యం పాలైన ఆదివాసీ యువకుడు పాండు నొరోటిని సరైన చికిత్స అందించకుండా జైలు అధికారులు హత్య చేశారని మావోయిస్టు పార్టీ ఆరోపించింది. ఈ నెల 13న నొరోటీ హత్యకు నిరసనగా, రాజకీయ ఖైదీల విడుదలకై దేశ‌వ్యాప్త ఆందోళనలు నిర్వహించాలని సీపీఐ మావోయిస్టు మధ్య రీజినల్ బ్యూరో అధికారప్రతినిధి ప్రతాప్ ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు.

ప్రతాప్ ప్రకటన పూర్తి పాఠం....

అస్థిత్వ పోరాటంలో మరో యువకుడికి జైలు శిక్ష, జైలులో హత్య

పాండు నొరోటి ఒక ఆదివాసీ నవయువకుడు. ఆయనపై పోలీసులు మోపిన నేరం గడ్చిరోలీ జిల్లాలో ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటున్నాడనేది. ఆ నేరానికి గడ్చిరోలీ జిల్లా న్యాయమూర్తి పాండు నొరోటికి జీవిత ఖైదు శిక్ష విధించాడు. నిజానికి ఇంతకన్నా తీవ్రమైన శిక్షే విధించాలని తీర్పు సందర్భంగా ఆ జడ్డీ వ్యాఖ్యానించాడు. అంటే ఆ యువకుడు తమ అడవులలో తాము ఆరాధ్య దైవంగా భావించే కొండలను లాయిడ్ మెటల్స్ కు లీజ్ కు ఇవ్వడాన్ని వ్యతిరేకించడమే జడ్జి గారి దృష్టిలో ఉరిశిక్ష విధించాల్సినంతటి నేరంగా మారింది. ఈ దేశపు న్యాయమూర్తులు తమ తీర్పుల ద్వారా ఈ దేశపు దోపిడీదారుల కొమ్ముకాస్తున్నారనే విషయాన్ని మరోమారు రుజువు చేసుకుంటే, ఆ తీర్పులను అమలు చేసే పోలీసు, జైళ్లు నిర్దోషులైన ఖైదీల పట్ల అంతకన్నా దారుణమైన వైఖరిని అనుసరిస్తున్నారనీ నాగపుర్ సెంట్రల్ జైలులో పాండు నొరోటికి అవసరమైన చికిత్స అందించకుండా ఆగస్టు 25 నాడు హత్య చేసి నిరూపించుకున్నారు. జైలులో ఖైదీల పట్ల అనుసరిస్తున్న అమానవీయ, అప్రజాస్వామిక, చట్ట వ్యతిరేక వైఖరిని మా పార్టీ మధ్య రీజినల్ బ్యూరో తీవ్రంగా ఖండిస్తూ అమరుడు పాండు నొరోటికి జోహర్లు అర్పిస్తున్నది. ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతోంది. పాండు అనారోగ్యం గురించి ఆయన కుటుంబానికి కానీ, ఆయన తరఫున నిలిచిన వకీలుకు కానీ చట్టబద్ధంగా తెలుపకుండా హత్య చేయడాన్ని మా పార్టీ ఖండిస్తున్నది. పాండు హత్యకు కారకులైన అధికారులను విచారించి శిక్షించాలనీ డిమాండ్ చేస్తున్నది.


(పాండు నొరోటీ)

పాండు నొరోటీ గడ్ చిరోలీ జిల్లా ఏటపల్లి తాలూకా మురెవేడ గ్రామంలో జన్మించిన 33 ఏళ్ల యువకుడు. ఆ ప్రాంతంలో గడచిన మూడు దశాబ్దాలకు పైగా ప్రజలు సుర్జాగఢ్ కొండలలో ఇనుప గనుల తవ్వకాలను వ్యతిరేకిస్తున్నారు. ఆ ప్రజల పోరాటానికి దేశంలోని నిజమైన దేశభక్తులు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, న్యాయవాదులు, ఆదివాసీ శ్రేయోభిలాషులు అండగా నిలిచారు. వారంతా మన దేశ వనరులను సామ్రాజ్యవాదుల పెట్టుబడులకు అమ్మడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కానీ, 2014లో మహారాష్ట్రలో అధికారాన్ని చేపట్టిన హిందుత్వ శక్తులు జిల్లాను పోలీసు నిలయంగా మార్చివేసి ఆఘమేఘాల మీద గనుల తవ్వకాలను ప్రారంభించాలనీ చర్యలు చేపట్టింది. వాటిలో భాగంగానే దానిని అడ్డుకుంటున్నారన్న ఆరోపణలతో ఢిల్లీ విశ్వవిద్యాలయ ఆచార్యులు సాయిబాబా సహ 6గురిని అరెస్టు చేశారు. అనతికాలంలోనే వారిలో 5గురికి జీవిత ఖైదు శిక్ష విధించారు. తప్పుడు ఆరోపణలపై కఠిన శిక్షలు విధించడం, వారిని జైలు పాలు చేసి జైలులోనే హత్య చేయడం గత 8 ఏళ్లుగా దేశంలో చూస్తున్నాం. ఈ చర్యలన్నీంటిని మా పార్టీ ఖండిస్తున్నది.

గడ్చిరోలీ మూలవాసీ ప్రజల పోరాటాలకు అండగా నిలిచిన ప్రజా రచయిత సుదీర్ దాన్లే, ప్రముఖ న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్, సామాజిక కార్యకర్తలు మహేశ్ రావుత్, అరుణ్ ఫరేరా, వర్నన్ గొంజాల్విస్, సోమాసేన్ (వీరంతా మహారాష్ట్ర కు చెందినవారే)లను నిరాధారంగా భీమా కోరేగాం కేసులో ఇరికించి జైలు పాలు చేశారు. గడ్ చిరోలీ ప్రజా పోరాటాలకు అండగా నిలిచిన ప్రముఖ రచయిత వరవరరావు, న్యాయవాది సుధా భరద్వాజ్ లను కూడ ఆ కేసులో ఇరికించారు. ఆ కేసులో ముద్దాయిగా ఉన్న ఫాదర్ స్టాన్ స్వామిని పోలీసులు 2021 జూలై 5 నాడు చికిత్స అందకుండా చేసి జైలులోనే హత్య చేశారు. గడ్చిరోలీ ప్రజలకు జీవితాంతం సేవ చేసిన విప్లవకారిణి కామ్రేడ్ నర్మదను ముంబాయి జైలులోనే హత్య చేశారు. ఈ రకంగా ప్రజల కోసం నిలిచిన వారిని జైలు పాలు చేయడం, జైళ్లలో హత్య చేయడం హిందుత్వ శక్తుల ఫాసిస్టు విధానాలకు పరాకాష్ట. మరోవైపు అమానవీయ పద్ధతులలో గుజరాత్ లో ముస్లిం మహిళ బిల్కిస్ బానోపై అత్యాచారం జరిపి ఆమె చిన్నారి కూతురును కుటుంబ సభ్యులను హత్య చేసి జీవిత ఖైదు అనుభవిస్తున్న హంతకులను నిస్సిగ్గుగా ʹస్వతంత్ర వేడుకలʹ సందర్భంగా విడుదల చేయడం, దానికి భిన్నంగా తన అస్థిత్వం కోసం పోరాడిన పాండును హత్య చేయడం ఈ వ్యవస్థ స్వభావాన్ని నగ్నంగా బట్టబయలు చేస్తున్నది.

కామ్రేడ్ పాండు నొరోటీ హత్యను ఖండిస్తూ రాజకీయ ఖైదీల విడుదలకై పోరాడుతున్న వ్యక్తులు, సంస్థలు సెప్టెంబర్ 13 నాడు దేశంలోని సమస్త రాజకీయ ఖైదీల విడుదలకు మరింత సమరశీల పోరాటాలకు ఉద్యమించాలనీ మా పార్టీ ప్రజాహిత శక్తులకు పిలుపునిస్తున్నది. కామ్రేడ్ పాండు హత్యను ఖండిస్తూ ముందుకు వచ్చిన వారంతా ఈ దేశంలోని ప్రజాహిత శక్తులను కటకటాలపాలు చేసి అణచివేయచూస్తున్న ఫాసిస్టు పాలకుల చర్యలను దృఢంగా ఎదుర్కొంటూ వారిని కాపాడుకోవడానికి మరింత సమరశీల పోరాటాలకు పూనుకో వాలనీ మా పార్టీ విజ్ఞప్తి చేస్తున్నది.

దేశంలోని రాజకీయ ఖైదీలందరినీ బేషరతుగా విడుదల చేయాలి
కామ్రేడ్ పాండు నొరోటీ హత్యకు కారకులైన పోలీసు, జైలు అధికారులను కఠినంగా శిక్షించాలి.

ప్రతాప్,
అధికార ప్రతినిధి,
మధ్య రీజినల్ బూరో,
సీపీఐ (మావోయిస్టు)

Keywords : cpi maoist, pratap, abhay, pandu noroti, nagpur jail, political prisoners,
(2023-03-26 20:29:36)



No. of visitors : 750

Suggested Posts


జంపన్నలేఖ‌కు మావోయిస్టు అభయ్ జవాబు - లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ

జూన్‌ 18న సీ.పీ.ఐ (మావోయిస్టు) అధికార ప్రతినిధిగా నేను ʹకొరోనాతో మావోయిస్టుల మరణం ఒక బూటకం, అది కేవలం పోలీసుల సృష్టిʹ అనే పత్రికా ప్రకటనను ఇచ్చాను. ఇందులో జంపన్నపై ʹవిప్లవ రాజకీయాల నుండి హీనాతిహీనంగా దిగజారిపోయిన

PLGA సావనీర్ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ - అభయ్ ఆడియో ప్రకటన‌

పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ PLGA ఏర్పడి 20 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా సీపీఐ మావోయిస్టు ఓ సావనీర్ విడుదల చేసింది. 20 ఏళ్ళ వేడుకల సందర్భంగా ఈ సావనీర్ విడుదల చేసినట్టు

పోలీసు చిత్రహింసల వల్ల రెండేళ్ళు కోమాలో ఉండి అంతిమ శ్వాస విడిచిన చింతన్ దా కు విప్లవ జోహార్లు -మావోయిస్టు పార్టీ

సీపీఐ (మావోయిస్టు) కేంద్రకమిటీ సభ్యులు కామ్రేడ్ నరేంద్ర సింగ్ (అశోదా, చింతన్ దా) ఒక పట్టణంలోని ఆసుపత్రిలో 2020 జనవరి 6న అంతిమశ్వాస విడిచారు. ఆయన దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 2018 నుంచి కోమాలో ఉన్నారు. ఆయన వయసు 74 సంవత్సరాలు.

Chhattisgarh:ఆయుధాలు వదిలి చర్చలకు రావాలన్న సీఎం పిలుపుకు మావోయిస్టుల జవాబు

మావోయిస్టులు ఆయుధాలు వదిలేసి చర్చలకు రావాలని చత్తీస్ గడ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ మాట్లాడిన నేపథ్యంలో ఆ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. తాము కూడా చర్చలకు సిద్దమే అని

మా నాయకత్వానికి కరోనా సోకి, లొంగిపోతున్నారన్న ప్రచారం ఓ కట్టుకథ -మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన‌

అనేక మంది మావోయిస్టులకు కరోనా సోకిందని, అందువల్ల అనేక మంది మావోయిస్టులు లొంగిపోనున్నారని పోలీసులు చేస్తున్న ప్రచారాన్ని మావోయిస్టు పార్టీ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి కథలు సృష్టించడంలో ఉభయ తెలుగు రాష్ట్రాల పోలీసు బాస్ లు మహా నేర్పరులని ఆ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నంలో భాగమే ʹఅగ్నిపథ్ʹ -మావోయిస్ట్ పార్టీ

భారత సైన్య త్రివిధ బలగాలలోకి యువతను కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేసుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ నూతన ʹఅగ్నిపథ్ʹ పథకాన్ని, అందుకు వ్యతిరేకంగా పది రాష్ట్రాలకు వ్యాపించిన, బిహార్ రాష్ట్రంలో రైల్వేల ధ్వంసం మొదలయిన సంఘటనలతో జరుగుతున్న ప్రజల అందోళనలపై తెలంగాణా రాష్ట్రం సికిందరాబాద్ ప్రాంతంలో కాల్పులలో వరంగల్ కు చెందిన రాకేష్ అనే వ్యక్తి మరణానికి,

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పూర్ణేందు శేఖర్ ముఖర్జీ మృతి - అభయ్ ప్రకటన‌

14 ఆగస్టు, 2021 మనం కొద్ది రోజులలో జరుపుకోబోతున్న మన పార్టీ అవిర్భావ వారోత్సవాల ఉత్సాహభరిత రాజకీయ వాతావరణంలో అత్యంత విషాదకర వార్తను వినాల్సి వస్తోంది. ఇటీవలే మా యువ సీసీ మెంబర్ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి కామ్రేడ్ యాప నారాయణ అమరత్వ వార్త నుండి మనమింకా పూర్తిగా తేరుకోక ముందే మేం వెటరన్ కామ్రేడ్ అంబర్ ను కోల్పోయాం.

అమ్మా! నను మన్నించు.. తల్లి మరణంపై మావోయిస్టు నాయకుడు వేణుగోపాల్ లేఖ!

మల్లోజుల కుటుంబంతో, పెద్దపల్లి పట్టణంతో వందేళ్ల నీ రుణం తీర్చుకున్నావా అమ్మా! నీ కడుపున పుట్టిన ఆరుగురి సంతానంలో నేనే చివరివాన్ని తల్లీ. నిను చివరి వరకు ఏడ్పించిన వాన్నీ నేనే అమ్మా.

11 మంది రేపిస్టుల విడుదలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌

2002 గుజరాత్ అల్లర్లలో బిల్కిస్ బానో ను అత్యాచారం చేసి 14 మందిని హత్య చేసిన దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడాన్ని CPI (మావోయిస్ట్) కేంద్ర కమిటీ ఖండిస్తోంది.

ప్రపంచ విప్లవ‌ పరిస్థితులపై మావోయిస్టు పార్టీ అంతర్జాతీయ వ్యవ‌హారాల కమిటీ ప్రకటన‌

అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చెందుతున్న విప్లవకర పరిస్థితిని ఉపయోగించుకోవడం, విధ్వంసక సామ్రాజ్యవాదాన్ని నాశనం చేయడం, యుద్ధాలకు తావు లేని సోషలిజాన్ని స్థాపించడం ప్రపంచ శ్రామికవర్గం, మార్క్సిస్ట్-లెనినిస్ట్-మావోయిస్ట్ శక్తుల తక్షణ కర్తవ్యం

Search Engine

అసలు మనుస్మృతి లో ఏముంది? -ఎన్. వేణుగోపాల్
పోలీసులు విమానాల ద్వారా బాంబు దాడులు చేస్తున్నారు, హిడ్మా క్షేమం -మవోయిస్టు పార్టీ ప్రకటన‌
కామ్రేడ్ సిసాన్ స్మృతిలో జనవరి 16న దేశవ్యాప్త కార్యక్రమాలకు మావోయిస్టు పార్టీ పిలుపు!
కాక‌లు తీరిన యోధుడు కామ్రేడ్ ఎస్‌.ఎల్‌.ఎన్ మూర్తి - మావోయిస్టు పార్టీ
అమ్మా! నను మన్నించు.. తల్లి మరణంపై మావోయిస్టు నాయకుడు వేణుగోపాల్ లేఖ!
సెప్టెంబర్ 17వ తేదీ చీకటి రోజు -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
పోలీసులు అరెస్ట్ చేసిన LOC కమాండర్ రజిత ,దళ సభ్యురాలును కోర్టులో హాజరు పరచాలి....CLC
పోలీసుల తూటాలకు బలైన 11 మంది గ్రామస్తులకు న్యాయం జరగాలని డిమాండ్
దుర్మార్గమైన బుల్డోజర్ సంస్కృతిని అమెరికాలో ప్రదర్శిస్తున్న హిందుత్వ మూక‌
విడుదల అవుతామనే యూఏపీయే ఖైదీల నమ్మకాన్ని వమ్ము చేస్తున్నకేరళ ప్రభుత్వం
11 మంది రేపిస్టుల విడుదలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ʹజీవితం మాకు పోరాటాన్నినేర్పింది...మేం పోరాడుతాం...మేం గెలుస్తాంʹ
బస్తర్ లో వేలాదిమందితో భారీ బహిరంగ సభ... రామకృష్ణ స్తూపావిష్కరణ‌
ఆదివాసీల‌ అణచివేతకు బుర్కపాల్ ఒక ఉదాహరణ
ఈ ఆదీవాసీ శ్రేయోభిలాషులను కాపాడుకుందాం...మావోయిస్టు పార్టీ పిలుపు
ʹజులై 28 నుండి ఆగస్టు 3 వరకు అమరుల సంస్మరణ వారాన్ని పాటించండిʹ
ధుఃఖమే ధిక్కారం... స్మృతులే అమరుల ఆశయ పతాకాలు
మార్గ‌ద‌ర్శి - అల్లం రాజ‌య్య‌...Part 2
మార్గ‌ద‌ర్శి - అల్లం రాజ‌య్య‌...Part 1
భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నంలో భాగమే ʹఅగ్నిపథ్ʹ -మావోయిస్ట్ పార్టీ
వరవరరావుకు మళ్లీ కోవిడ్, ఆస్పత్రిలో చేరిక
ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు
సిలంగేర్, హస్‌దేవ్, తికాయత్: దాడుల అంతర్ సంబంధం
చెర సాహిత్య స‌ర్వస్వం పున‌ర్ముద్ర‌ణ‌... మీ కాపీని ముంద‌స్తుగా బుక్ చేసుకోండి..
బ్రహ్మదేవ్ సింగ్ ను హత్య చేసిన భద్రతా దళాలపై ఏడాది తర్వాత ఎఫ్ఐఆర్ నమోదు
more..


పాండు