నేటి నుంచి అమర వీరుల సంస్మ‌రణ వారం ప్రారంభం - ఘనంగా జరపాలని మావోయిస్ట్ పార్టీ పిలుపు

నేటి

అమర వీరుల సంస్మ‌రణ వారాన్ని ఘనంగా జరపాలంటూ మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు కొమ్రం భీం మంచిర్యాల డివిజన్ కమిటీ కార్యదర్శి భాస్కర్ ఓ ప్రకటన విడుదల చేశారు.

భాస్కర్ ప్రకటన పూర్తి పాఠం...

జూలై 28 నుండి ఆగస్టు 3 వరకు అమర వీరుల సంస్మ‌రణ వారాన్ని ఘనంగా జరపండి !
హిందు రాజ్య స్థాపన లక్ష్యంతో ప్రజలపై కొనసాగిస్తున్న ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాడండి!
విప్లవ ప్రతీఘాతుక సూరజ్ ఖండ్ వ్యూహాత్మక దాడిని ఓడించండి!

ప్రియమైన ప్రజలారా!
కార్మిక, కర్షక, విద్యార్ధి, యువజనులారా!
సకల సమస్యలకు సమాజ మార్పుకు పోరాటం ఒకటే ఏకైక మార్గం అది చరిత్ర చెప్పిన సంత్యం. మన భారతదేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవం విజయవంతం చేసి అంతిమంగా సోషలిజం, కమ్యూనిజాన్ని స్థాపించడానికి దీర్ఘకాలిక సాయుధ ప్రజాయుద్ధ పంథాను రూపొందించి ఈ మార్గం సరైదని మన పార్టీ సంస్థాపకులు ఉపాధ్యాయులు కా. చారుమజుందార్, కా, కనాయ్ చర్జీలు వర్తమాన సామాజిక విప్లవంలో మార్గ దర్శకులుగా ఉండినారు. సాయుధ పోరాట మార్గంలో సామ్రాజ్యవాద, దళారీ నిరంకుశ పెట్టుబడుదారులు, భూస్వామ్య వర్గాలతో అలుపెరుగని పోరాటాన్ని కొనసాగిస్తూ నేల రాలిన వేలాది మంది విప్లవకారులు స్కృతిలో ప్రతి సంవత్సరం జూలై 28 నుండి ఆగస్టు 3 వరకు అమరుల సంస్కరణ వారాన్ని జరుపుకుంటున్నాం. ఈ వారాన్ని కూడా విప్లవ దృఢ సంకల్పంతో జరుపుకోవాలని పిలుపునిస్తున్నాము.

2022 ఆగస్టు నుండి 2023 జూలై వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఫాసవికమైన విప్లవ ప్రతీఘాతుక సమాధాన్ దాడిని ఎదుర్కొంటూ విప్లవోద్యమాన్ని పురోగమింపచేయడానికి దేశవ్యాప్తంగా ఈ కాలంలో 100 మందికి పైగా విప్లవకారులు అమరులైనారు. మన పార్టీ కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో సభ్యుడు, మన ప్రియతమ నాయకుడు కా. ఆనంద్ (కటకం సుదర్శన్) మే 31న గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. క్రాంతి పత్రిక ఎడిటర్ కా, ఎల్ఎస్ఎన్ మూర్తి (రాష్ట్ర కమిటీ స్థాయి) అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. తెలంగాణ విప్లవోద్యమం తాత్కాలిక వెనుకంజ నుండి ముందజ వేయడానికి వర్గ శత్రువుతో రాజీలేని పోరాటం చేస్తూ కొమ్రం భీం - మంచిర్యాల డివిజన్ కమిటీ కా. అనితక్క (డీవీసీఎమ్), కా. అశోక్ (పార్టీ సభ్యుడు) మహారాష్ట్ర సీ-60, ఛత్తీస్గడ్ కమాండ్ డీఆర్, తెలంగాణ గ్రేహౌండ్స్ కేంద్ర ఎన్.జీ. బలగాలతో వీరోచితంగా పోరాడుతూ తమ నులి వెచ్చని నెత్తురు చిందించారు. దేశవ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా ప్రజాయుద్ధంలో ప్రాణాలర్పించిన వీరులకు, వీరవనితలందరికీ కొమ్రంభీం-మంచిర్యాల డివిజన్ కమిటీ పేరు పేరునా వినమ్రంగా విప్లవ జోహార్లు అర్పిస్తుంది.

అమెరికా ఫాసిస్టు సామ్రాజ్యవాదం ఫిలిపెన్స్ కమ్యూనిస్టు పార్టీపై క్రూరమైన దాడులు చేస్తూ ఈ మధ్యకాలంలో ఫిలిపెన్స్ కమ్యూనిస్టు పార్టీ సీసీ సభ్యులయిన కా. లాన్, కా, బగోంగు టావో లు సముద్రయాణం చేస్తున్నప్పుడు మార్గం మధ్యలో పట్టుకొని అరెస్టు చేసి క్రూరమైన చిత్రహింసలు పెట్టి వారిని హత్య చేసారు. హింసలు భరించి పార్టీ రహాస్యాలను కాపాడిన మహోన్నత త్యాగశీలురు. జూలై 28 సందర్భంగా ఈ కామ్రేడ్స్కు తలలు వంచి వినమ్రంగా జోహార్లు అర్పిద్దాం. వీరుల ఆశయాలను మునుముందుకు తీసుకుపోదాం. ఈ వీరులు పీడిత ప్రజలకు నూతన తరానికి స్ఫూర్తి ప్రదాతలుగా, ప్రేరణగా నిలుస్తారు. దేశ భవిష్యత్త్తుకు మార్గదర్శకులుగా నిలుస్తారు. మార్క్సిస్టు పోరాట చరిత్రలో ఆవిష్కృతం అవుతారు. వీళ్లంతా దేశంలోని ప్రజల సకల సమస్యలకు పునాది అయిన సామ్రాజ్యవాదం, దళారీ నిరంకుశ బూర్జువా వర్గం, భూస్వామ్య దోపిడి వర్గాలను కూలదోయడానికి వర్గ పార్టీ నాయకత్వంలో కూకటి వేళ్లతో సహా పెకిలించి అసమానతలు లేని సమాజం కోసం స్వప్నించిన చైతన్యశీలమైన మానవతా వాదులు. కేవలం భారత ప్రజల విముక్తికోసమే కాకుండా ప్రపంచంలో ఉన్న పీడిత ప్రజల, కార్మికులను, జాతులను విముక్తి చేయడానికి సోషలిస్టు సమాజం నిర్మించి అంతిమంగా కమ్యూనిజం స్థాపించే లక్ష్యంతో ఉన్నత ఆశయంతో పోరాడిన వాళ్లు. వీరి త్యాగం ఎంతో ఉన్నతమైనది. అది హిమ శిఖరాల కన్నా గొప్పనైనది, శాశ్వతమైనది.

దేశంలో ఆర్ఎస్ఎస్ మోడీ ప్రభుత్వం ప్రపంచీకరణ విధానాలను వేగంగా అమలు చేస్తున్నారు. దేశాన్ని గా అభివృద్ధి చేస్తాననే పేరుతో అఖండ హిందు రాజ్యాన్ని స్థాపించాలనే దీర్ఘకాలిక పథక రచన చేసి ఆ పథకం అమలుకై ప్రజావ్యతిరేక విప్లవ ప్రతీఘాతుక సూరజ్ కుండ్ వ్యూహాత్మ దాడిని చేస్తున్నాడు. మోడీ, అమిషా నాయకత్వంలో బీజేపీ బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజపు యుద్ధాన్ని దేశ ప్రజలపై కొనసాగిస్తున్నారు. హిందు ఫాసిజం నేడు దేశ ప్రజల ప్రధాన విపత్తు శత్రువుగా, ప్రమాదకారిగా మారింది. ఉదా: మణిపూర్ సంఘటనే సాక్ష్యం. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, కేంద్రంలో బీజేపీతో ఉన్న అంతర్గత కుమ్మక్కులతో అమలు చేస్తున్న నయా ఉదారవాద విధానాలు ఒక దిక్కు, అంతర్జాతీయంగా ఏర్పడిన సంక్షోభం ప్రభావం మరొక దిక్కు ఈ కారణాలచే దేశంలో, రాష్ట్రంలో, జిల్లాలో కూడా ఆకలి, దరిధ్రం కార్మికుల గెంటివేత, నిర్వసిత సమస్య, రైతుల ఆత్మహత్యలు, నిరుద్యోగం, దోపిడి, దొంగతనాలు, మహిళలపై లైంగిక వేధింపులు, హత్యలు, అత్యాచారాలు, దళితుల, ఆదివాసులు, మత మైనార్టీలపై దాడులు, అధిక ధరలు పెరగడం నిజవేతనాలు పడిపోవడం జీవన వ్యయం పెరిగి దోపిడి పాలకకులపై అసంతృప్తి, వ్యతిరేకత సంతరించుకుని ప్రజా పోరాటాలు, ఆందోళనలు ముందుకు వస్తున్నాయి.

ఈ ఆందోళన పోరాటాలు అణిచివేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో ఫాసిజాన్ని అమలు చేస్తున్నారు. ఈ ఫాసిజానికి వ్యతిరేకంగా గొంతు విప్పిన ప్రజలపై, ప్రజాస్వామిక వాదులపై ఊపా చట్టాన్ని అమలు చేస్తున్నారు. ఈ అభివృద్ధి నిరోధక ప్రమాదకర ఫాసిజాన్ని ఓడించ వలసిన ప్రధాన కర్తవ్యం దేశ ప్రజల రాష్ట్ర ఉమ్మడి జిల్లాల డివిజన్ ప్రజల ముందు ఉన్నాది. సామ్రాజ్యవాద, దళారీ నిరంకుశ పెట్టుబడిదారీ భూస్వామ్య వర్గాలను కూల్చి మనిషిని మనిషి దోచుకోలేని, జాతిని మరో జాతి ఇంక ఎంత మాత్రం దోచుకోలేని సమసమాజ స్థాపన కొరకు కొనసాగుతున్న సాయుధ పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్లడం ద్వారానే సంపూర్ణ స్వేచ్ఛ, సమానత్వం సాధించగలుగుతాము.
ఈ మార్గంపై అత్యంత విశ్వాసాన్ని ఉంచి దీర్ఘకాలిక సాయుధ ప్రజాయుద్ధంలో భాగస్వాములం అవుదాం, అమరవీరుల ఆశయాలను సాధించుకుంటూ గ్రామ గ్రామాన, పల్లె పల్లెల్లో, పట్టణ కార్మిక వాడల్లో పోస్టర్లు, బ్యానర్లు, కరపత్రాలు తో ప్రచారం చేస్తూ, సభలు సమావేశాలు జరుపుతూ జూలై 28 అమరవీరుల వారోత్సవాలను ఘనంగా నిర్వహించి విజయవంతం చేయాలని కొమ్రం భీం మంచిర్యాల డివిజన్ కమిటీ పిలుపునిస్తుంది.

విప్లవాభివందనాలతో,
సీపీఐ (మావోయిస్ట్)
కార్యదర్శి భాస్కర్,
కొమ్రం భీం - మంచిర్యాల డివిజన్ కమిటీ,

Keywords : cpi maoist, Telangana, komram bheem, manchiryala, bhaskar, abhay,
(2024-07-26 04:45:43)



No. of visitors : 1160

Suggested Posts


పాలకులకు లొంగిపోయిన‌ విప్లవ‌ద్రోహి గజ్జెల సత్యం రెడ్డిని ఎండగట్టండి... మావోయిస్టు పార్టీ ప్రకటన‌

విడుదల తర్వాత ఆర్.టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా ఆయన తన లొంగుబాటునూ, రాజకీయ పతనాన్ని నిస్సిగ్గుగా బయటపెట్టుకున్నాడని ,మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ అన్నారు.

జంపన్నలేఖ‌కు మావోయిస్టు అభయ్ జవాబు - లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ

జూన్‌ 18న సీ.పీ.ఐ (మావోయిస్టు) అధికార ప్రతినిధిగా నేను ʹకొరోనాతో మావోయిస్టుల మరణం ఒక బూటకం, అది కేవలం పోలీసుల సృష్టిʹ అనే పత్రికా ప్రకటనను ఇచ్చాను. ఇందులో జంపన్నపై ʹవిప్లవ రాజకీయాల నుండి హీనాతిహీనంగా దిగజారిపోయిన

PLGA సావనీర్ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ - అభయ్ ఆడియో ప్రకటన‌

పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ PLGA ఏర్పడి 20 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా సీపీఐ మావోయిస్టు ఓ సావనీర్ విడుదల చేసింది. 20 ఏళ్ళ వేడుకల సందర్భంగా ఈ సావనీర్ విడుదల చేసినట్టు

అమ్మా! నను మన్నించు.. తల్లి మరణంపై మావోయిస్టు నాయకుడు వేణుగోపాల్ లేఖ!

మల్లోజుల కుటుంబంతో, పెద్దపల్లి పట్టణంతో వందేళ్ల నీ రుణం తీర్చుకున్నావా అమ్మా! నీ కడుపున పుట్టిన ఆరుగురి సంతానంలో నేనే చివరివాన్ని తల్లీ. నిను చివరి వరకు ఏడ్పించిన వాన్నీ నేనే అమ్మా.

పోలీసు చిత్రహింసల వల్ల రెండేళ్ళు కోమాలో ఉండి అంతిమ శ్వాస విడిచిన చింతన్ దా కు విప్లవ జోహార్లు -మావోయిస్టు పార్టీ

సీపీఐ (మావోయిస్టు) కేంద్రకమిటీ సభ్యులు కామ్రేడ్ నరేంద్ర సింగ్ (అశోదా, చింతన్ దా) ఒక పట్టణంలోని ఆసుపత్రిలో 2020 జనవరి 6న అంతిమశ్వాస విడిచారు. ఆయన దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 2018 నుంచి కోమాలో ఉన్నారు. ఆయన వయసు 74 సంవత్సరాలు.

Chhattisgarh:ఆయుధాలు వదిలి చర్చలకు రావాలన్న సీఎం పిలుపుకు మావోయిస్టుల జవాబు

మావోయిస్టులు ఆయుధాలు వదిలేసి చర్చలకు రావాలని చత్తీస్ గడ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ మాట్లాడిన నేపథ్యంలో ఆ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. తాము కూడా చర్చలకు సిద్దమే అని

11 మంది రేపిస్టుల విడుదలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌

2002 గుజరాత్ అల్లర్లలో బిల్కిస్ బానో ను అత్యాచారం చేసి 14 మందిని హత్య చేసిన దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడాన్ని CPI (మావోయిస్ట్) కేంద్ర కమిటీ ఖండిస్తోంది.

గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ

గద్ద‌ర్ మరణం మమ్మల్ని తీవ్రంగా భాదకు గురి చేసింది. మా సంతాపాన్ని, కుటుంబానికి మా సానుభూతి తెలియ జేస్తున్నాము.

మా నాయకత్వానికి కరోనా సోకి, లొంగిపోతున్నారన్న ప్రచారం ఓ కట్టుకథ -మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన‌

అనేక మంది మావోయిస్టులకు కరోనా సోకిందని, అందువల్ల అనేక మంది మావోయిస్టులు లొంగిపోనున్నారని పోలీసులు చేస్తున్న ప్రచారాన్ని మావోయిస్టు పార్టీ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి కథలు సృష్టించడంలో ఉభయ తెలుగు రాష్ట్రాల పోలీసు బాస్ లు మహా నేర్పరులని ఆ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నంలో భాగమే ʹఅగ్నిపథ్ʹ -మావోయిస్ట్ పార్టీ

భారత సైన్య త్రివిధ బలగాలలోకి యువతను కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేసుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ నూతన ʹఅగ్నిపథ్ʹ పథకాన్ని, అందుకు వ్యతిరేకంగా పది రాష్ట్రాలకు వ్యాపించిన, బిహార్ రాష్ట్రంలో రైల్వేల ధ్వంసం మొదలయిన సంఘటనలతో జరుగుతున్న ప్రజల అందోళనలపై తెలంగాణా రాష్ట్రం సికిందరాబాద్ ప్రాంతంలో కాల్పులలో వరంగల్ కు చెందిన రాకేష్ అనే వ్యక్తి మరణానికి,

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


నేటి