అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ

22-09-2023

24 సెప్టెంబర్‌ ఆదివారం సాయంకాలం 6 గంటలకు, సుందరయ్య విజ్ఞాన కేంద్రం, హైదరాబాదు
1985 నుంచి విప్లవోద్యమ చరిత్రను అజ్ఞాత రచయిత్రులు కథలుగా రాశారు. అనేక సంకెళ్లలో ఉండిన మహిళలు విప్లవోద్యమ చైతన్యంతో ప్రజా జీవితంలోకి వచ్చారు. ఈ ప్రపంచాన్ని మార్చే పోరాటంలో భాగమయ్యారు. ఇంత వరకు చరిత్రకు ఉన్న అర్థాలన్నీ మార్చేసి ప్రజలే చరిత్ర నిర్మాతలనే మాటను నిజం చేస్తున్నారు. భారతదేశంలో మావోయిస్టు ఉద్యమంలో ఉన్నంత మహిళా ఉద్యమం మరే ఉద్యమంలో లేదని పరిశీలకులు అంటున్నారు. కేవలం సంఖ్యరీత్యానే కాదు, విప్లవోద్యమంలోని మేధో నాయకత్వం నుంచి సైనిక రంగం దాకా అన్నింటా సగానికి పైగా ఉన్నారు. నిర్ణయాత్మకంగా, సృజనాత్మకంగా భాగమయ్యారు. పితృస్వామ్య వ్యతిరేక పోరాటాన్ని కుటుంబాన్ని, రాజ్యాన్ని, ఆస్తి సంబంధాలను మార్చే పోరాటంగా అభివృద్ధి చేస్తున్నారు.
ఈ సామాజిక సాంస్కృతిక రాజకీయార్థిక వర్గపోరాట క్రమంలో మహిళ కార్యకర్తల నుంచే రచయిత్రులు తయారయ్యారు. వాళ్లు చరిత్రను, వర్గపోరాటాన్ని సంపద్వంతం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ దేశంలో పీడితులందరిలోకెల్లా పీడితులైన దళిత బహుజన, ఆదివాసీ, శ్రామిక మహిళల చరిత్రను నిర్మిస్తున్నారు. ఆ వీరగాథను కథలుగా రాస్తున్నారు. అట్లా 1985లో అచ్చయిన కథ నుంచి ఇప్పటి దాకా 52 మంది సాయుధ రచయిత్రులు రాసిన 282 కథలను విరసం ʹవియ్యుక్కʹ పేరుతో ఆరు సంకలనాలుగా తీసుకొస్తోంది. ఇందులో 148 కథలు అజ్ఞాత విప్లవోద్యమ జీవితాన్ని చిత్రించాయి. 134 కథలు పట్టణ ఉద్యమాన్ని, సాధారణ జీవితంలోని వైరుధ్యాలను, సంఘర్షణలను చిత్రించాయి. ఇవన్నీ చదివితే నలభై ఏళ్ల విప్లవోద్యమ చరిత్రలాగే తెలుగు సమాజాల సాంస్కృతిక రాజకీయ చరిత్ర కూడా తెలుస్తుంది. బండారు అచ్చమాంబ, తాడి నాగమ్మలాంటి వారి చేతిలో పుట్టి పెరిగిన తెలుగు మహిళల కథను అజ్ఞాత రచయిత్రులు సమరశీలంగా, విప్లవాత్మకంగా తీర్చిదిద్దారు.

వియ్యుక్కʹ అంటే గోండీలో వేగుచుక్క అని అర్థం. నలభై ఏళ్ల కింద తెలంగాణ నుంచి దండకారణ్యానికి విస్తరించిన విప్లవోద్యమం ఆదివాసీ భాషా, సాంస్కృతిక పరిమళాన్ని సంతరించుకుంది. తెలుగు, గోండీ పోరాట భాషగా కలిసిపోయాయి. అందువల్లే అజ్ఞాత రచయిత్రుల తెలుగు కథల సంకలనాలకు వియ్యుక్క అనే పేరు పెట్టాం.
మానవ సంబంధాల్లో, వ్యక్తిత్వాల్లో, విలువల్లో, దృక్పథాల్లో మార్పును చిత్రించగల అద్భుత ప్రక్రియ కథ. తద్వారా సామాజిక పరిణామాన్ని సూక్ష్మ రూపంలో విశ్లేషించగల ప్రక్రియ కథ. విప్లవోద్యమాన్ని నిర్మించడం, దాన్ని సృజనాత్మకంగా రచించడం చరిత్ర అవసరంగా భావించి ఈ రచయిత్రులు కథా ప్రక్రియను ఎంచుకున్నారు. అందు వల్ల ఈ కథలన్నిటిలోని సాధారణ ఇతివృత్తం మార్పు. అందులో సహజంగానే తీవ్రమైన ఘర్షణ ఉంటుంది. వాస్తవికత ఉంటుంది. మానవ జీవితమంతా పరచుకొని ఉండే భావోద్వేగాలు ఉంటాయి. గొప్ప చైతన్యం , ఎరుక ఉంటాయి. జీవితంలో ఉండేవన్నీ విప్లవంలో ఉంటాయనే మాటను అక్షరాలా నిజం చేసిన కథలివి. ప్రముఖ విప్లవ రచయిత్రి బి. అనూరాధ ఈ సీరీస్‌కు ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.
ఈ ఆరు సంపుటాల్లో మూడు విడుదలయ్యాయి. వీటి ఆవిష్కరణ సభ ఈ నెల 24, ఆదివారం సాయంకాలం 6 గంటలకు హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞాన కేందర్రలో ఉంది. ఈ సభకు వరలక్ష్మి అధ్యక్షత వహిస్తుంది. మూడు సంపుటాలను డా. విజయభారతి ఆవిష్కరిస్తారు. కళ్యాణి కుంజ, ప్రొ. సునీతారాణి, ప్రొ. కాత్యాయనీ విద్మహే, తాయమ్మ కరుణ, బి. అనూరాధ మాట్లాడతారు. ఈ సభకు తప్పక రండి. ఈ పుస్తకాలు కొనండి. సాయుధ విప్లవోద్యమ మహిళా కథలను చదవండి
` విప్లవ రచయితల సంఘం

Keywords : viyyukka, writers, dandakaranya, cpi maoist,
(2024-04-26 16:51:15)



No. of visitors : 734

Suggested Posts


కలకత్తాలో జరుగుతున్న చారుమజుందార్ శత జయంతి ఉత్సవాల్లో విరసం కార్యదర్శి పాణి స్పీచ్

నక్సల్బరీ లేకపోతే భారత పీడిత ప్రజానీకానికి విప్లవ‌ దారే లేకుండా పోయేది. కమ్యూనిస్టు రాజకీయాలు చర్చించుకోవడానికే తప్ప వర్గపోరాట బాట పట్టకపోయేవి. ఆ నక్సల్బరీ దారిని చూపినవాడు చారు మజుందార్. విప్లవ పార్టీకి వ్యూహాన్ని, ఎత్తుగడలను ఒక సాయుధ పోరాట మార్గాన్ని చూపించిన వాడు చారు మజుందార్.

ఆదివాసి.. లంబాడా వివాదం ‍- ఎం.రత్నమాల

మహారాష్ట్ర ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి తెగగా గుర్తించడం లేదు కనుక ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి షెడ్యూల్డు తెగగా ప్రకటించడంతో దీన్ని అవకాశంగా తీసుకుని మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌ (పాత) జిల్లాకు లంబాడాల వలసలు పెద్ద ఎత్తున వెల్లువలా సాగాయి.....

మహాశ్వేతా దేవి - మన తెలంగాణ సాగర హారంః వరవర రావు

మన మహా సాగరహారం ʹచలో హైదరాబాద్ అంటూ తెలంగాణ మార్చ్ చేసిన సెప్టెంబర్ 30, 2012 మహత్తర మధ్యాహ్నం మహాశ్వేతాదేవి కూడా మన ఊర్లో ఉన్నారు. ఆ రోజు ఆమెను మన మధ్యకు తెచ్చుకొని ఉంటే....

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

1947 ఆగస్ట్ 15న విలీనానికి అంగీకరించకుండా షరతులు విధిస్తూ వచ్చిన నిజాంను నెహ్రూ - పటేల్ ప్రభుత్వం సగౌరవంగా, సాదరంగా చర్చలకు ఆహ్వానించింది. అప్పటికే నిజాంను వ్యతిరేకిస్తూ వీరోచిత పోరాటం నడుపుతున్న కమ్యూనిస్టులను మాత్రమే కాదు, కనీసం కాంగ్రెస్ ను కూడా ఈ చర్చల్లో భాగం చేయలేదు....

అమరుడు బొజ్జా తారకం — ʹనది పుట్టిన గొంతుకʹ - వరవరరావు

గోదావరి తెలంగాణలో ప్రవేశించిన నిజామాబాద్ కు 1968లో వచ్చిన తారకం గారు ఇక్కడి మట్టిలోని ఎరుపులోనూ, ఇక్కడి నీళ్లలోని ప్రవాహ గుణంలోనూ కలగలిసిపోయారు. 1968 నుంచి 78 దాకా ఒక దశాబ్దం పాటు విప్లవోద్యమాలకు, విప్లవ సాహిత్యానికి నిజామాబాద్ చిరునామా బొజ్ఞాతారకం....

ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పోరాటానికి విరసం మద్దతు

అట్టడుగున ఉన్న మనిషికి ఫలితాలు అందినప్పుడే సామాజిక న్యాయం జరిగినట్టు లెక్క. మాదిగ, డక్కలి, చిందు, మాష్టి, బుడగజంగం, దాసరి, బేగరి కులాలకు ఈ నాటికీ ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు....

ʹఅన్నలు మల్లొస్తరు బిడ్డా.. ఆల్లొస్తే వాళ్ళకు గిన్ని మంచి నీల్లో, తిండో పెట్టాలనే బతుకుతాన్నʹ

అందుకే అంత నిర్బంధంల కూడా నా కొడుకు అంత్యక్రియలకు వచ్చిన జనాలకు మా ఖిలా వరంగల్ సరిపోలె. ఎక్కడోల్లను అక్కడ అరెస్ట్ చేసినా వచ్చిండ్రు. ఎవరో నక్సలైట్ అట, చిన్న పిల్లగాడేనట, బలే తెలివికల్లోడట అని అనుకుంట జనాలు వచ్చిండ్రు. పద్దెనిమిది నిండి పందొమ్మిది పడగానే చంపేసిండ్రు.

కాగడాగా వెలిగిన క్షణం... అమరుడు యెం యెస్ ఆర్ కోసం ... నారాయణ స్వామి

ఎంత ప్రాణం శ్రీనుది బక్క పలుచగా ఉండేటోడు – ఎక్కడన్న సరిగ్గా తిన్నడో లేదో శరీరం లో బలం సత్తువ ఉన్నదో లేదో – ఆ దుర్మార్గులు పట్టుకొని చిత్రహింసలు పెడుతుంటే ఆ లేత శరీరం ఎంత గోస పడిందో ఎంత హింసకు గురైందో ఎంత అల్లల్లాడిందో – ఆ క్రూరులు చంపేయ్యబోతుంటే, చివరికి మేఘే ఢాకా తార లో సుప్రియ అరిచినట్టు నాకు బతకాలని ఉంది నాకు చావాలని లేదు నాకు బతకాలని ఉంది....

ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల‌

అంతకుముందు అంతర్జాతీయ శ్రామికవర్గ పతాకావిష్కరణతో కార్యక్రమాలను ప్రారం భించారు. అమరుడు పులి అంజన్న తల్లి సైదమ్మ ఎర్ర జెండాను, సీనియర్ విరసం సభ్యురాలు రత్నమాల విప్లవ రచయితల సంఘం జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా అమరుడు శేషయ్య సోదరుడు సాంబయ్య, అమరుడు వివేక్ తండ్రి యోగానంద్ అమరుల స్థూపాన్ని ఆవిష్క రించారు.

ʹఅరుణోదయʹ పై పోలీసుల దాడిని ఖండించిన విరసం

తెలంగాణ ఉద్యమంలో ఆట పాటతో ఆరుణోదయ కళాకారులు గ్రామ గ్రామాన తిరిగి ప్రజల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ వంతు కృషి చేశారు. ఆ సంస్థ కార్యాలయాన్ని దౌర్జన్యంగా మూసేయడం అత్యంత నిరంకుశమైన......

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
మణిపూర్ లో ప్లాటినం, క్రోమైట్, నికెల్ వంటి ఖనిజ సంపదను దోచుకోవడానికే కుకీల ఊచకోత -మావోయిస్టు పార్టీ
more..


అజ్ఞాత