తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు

తెలంగాణ,

02-10-2023

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో 62 చోట్ల ఎన్ ఐఏ సోదాలు నిర్వహించింది. ఏక కాలంలో జరిగిన ఈ సోదాల్లో అనేక బృందాలు పాల్గొన్నాయి.
పౌర హక్కుల సంఘం, కుల నిర్మూలన పోరాట సంఘం, అమరుల బంధు మిత్రుల సంఘం, చైతన్య మహిళా సంఘం , పీడీఎం, ప్రజాకళామండలి, విరసం, ప్రగతిశీల కార్మిక సంఘం, IAPL తదితర సంస్థల నాయకులు, కార్యకర్తల ఇళ్ళలో ఎన్ ఐ ఏ సోదాలు నిర్వహించింది.

కాగా ఎన్ ఐ ఏ దాడులను పౌరహక్కుల సంఘం తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
CLC ప్రెస్ రిలీజ్:
ఉభయ తెలుగు రాష్ట్రాల్లోఈరోజు 2 అక్టోబర్2023 ఉదయం 6గంటల నుండి NIA పోలీసులు, పౌర హక్కుల, ప్రజాసంఘాల నాయకుల ఇండ్లల్లో చేస్తున్న దాడులను పౌర హక్కుల సంఘం ఖండిస్తున్నది...
ఈరోజు 2 అక్టోబర్2023 ఉదయం హైదరాబాద్ లోని సుభాష్ నగర్ లో నివసిస్తున్న ABMS నాయకులు భవాని ఇంటిపై NIA పోలీసులు దాడి చేసి సోదాలు నిర్వహిస్తున్నారు.
ABMS నాయకురాలు శాంతక్క వరంగల్ ఇంటిపై,
ABMS నాయకురాలు ధనలక్ష్మి, శ్రీకాకుళం,
ABMS నాయకురాలు శోభ, ప్రకాశం,
ABMS నాయకుడు, కోదండు,శ్రీకాకుళం.
హైదరాబాద్, విద్యానగర్ లోని IAPL జాతీయ కార్యదర్శి అడ్వకేట్ సురేష్ ,పిచ్చుక శ్రీనివాస్ అడ్వొకేట్, IAPL,ఆంధ్రప్రదేశ్,
CLC ఆంధ్రప్రదేశ్ నాయకులు......
CLCనెల్లూరు జిల్లా పౌర హక్కుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎల్లంకి వెంకటేశ్వర్లు
CLC, AP, తిరుపతి పట్టణంలో ఉభయ తెలుగు రాష్ట్రాల పౌర హక్కుల సంఘం నాయకులు, న్యాయవాది క్రాంతి చైతన్య ఇంటిపై,
CLC, AP,నంబూరి శ్రీమన్నారాయణ అడ్వొకేట్,,పౌర హక్కుల సంఘం ఆంధ్రప్రదేశ్,
CLC, AP ,ఆంజనేయులు,పౌర హక్కుల సంఘం ఆంధ్రప్రదేశ్ నాయకులు,విజయవాడ,
CLC, AP పోతుగంటి రాజారావు, అడ్వొకేట్, పౌర హక్కుల సంఘం ఆంధ్రప్రదేశ్ నాయకులు,
CLC, AP,శ్రీరాములు,పౌర హక్కుల సంఘం ఆంధ్రప్రదేశ్ నాయకులు,అనంతపురం,
CLC, AP,డాక్టర్ రాజారావు, పౌర హక్కుల సంఘం, ఆంధ్రప్రదేశ్, పొన్నూరు,
CLC, AP,నజర్,పౌర హక్కుల సంఘం, ఆంధ్రప్రదేశ్, రాజమండ్రి.
CLC AP, చీమలపెంట వెంకటేశ్వర్లు,పౌర హక్కుల సంఘం కడప,
HRF నాయకురాలు సుధ, విశాఖపట్నం,
CMS నాయకురాలు, సిసొరా నెల్లూరు,
CMS నాయకురాలు రాధ, విజయవాడ,
CMS S అనిత నాయకురాలు, హనుమకొండ,
PKS నాయకులు బత్తుల రమణయ్య, తాడేపల్లి గూడెం,
విరసం నాయకులు:రివేరా ఆంధ్రప్రదేశ్,Pకిరణ్,ఆంధ్రప్రదేశ్
విరసం నాయకులు సాగర్, హైదరాబాద్, ,
PKM,G.రాంచందర్ నాయకులు షాద్ నగర్, ,
PKM, రాణి, సత్తెనపల్లి, నాగేశ్వరరావు, సత్తెనపల్లి.
మిస్క కృష్ణయ్య,KNPS నాయకులు,శ్రీకాకుళం,
బాలయ్యKNPS నాయకులు కావలి.
దుడ్డు వెంకటరావు KNPS నాయకులు
ఓర్సు శ్రీనివాసరావు KNPSనాయకులు
రామకృష్ణ, నరసరావుపేట, PDM,.
ఇండ్లపై NIA పోలీసులు దాడులు ఈ రోజు ఉదయం 6 గంటల నుండి చేస్తున్నారు. ఈ దాడులను పౌర హక్కుల సంఘం తెలంగాణ తీవ్రంగా ఖండిస్తున్నది,వెంటనే ఈ అక్రమ దాడులను నిలిపి వేయాలని డిమాండ్ చేస్తోంది....ప్రజాస్వామిక వాదులు, మేధావులు అందరు ఈ నిర్బంధ దాడులను ఖండించాలని పౌర హక్కుల సంఘం విజ్ఞప్తి చేస్తున్నది...
1.ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, అధ్యక్షుడు, పౌర హక్కుల సంఘం తెలంగాణ.
2.N. నారాయణ రావు,ప్రధాన కార్యదర్శి,పౌర హక్కుల సంఘం తెలంగాణ.

మరో వైపు ఎన్ ఐ ఏ సోదాలపై ఓ ప్రకటన విడుదల చేసింది.

NIA ప్రెస్ రిలీజ్


ముంచింగ్‌పుటు సీపీఐ (మావోయిస్ట్‌) కుట్ర కేసులో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ వ్యాప్తంగా జరిపిన దాడుల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) సోమవారం ఒకరిని అరెస్టు చేసి ఆయుధాలు, నగదు, నేరారోపణలు రుజువు చేసే వస్తువులను స్వాధీనం చేసుకుంది.

రెండు రాష్ట్రాల్లోని 62 ప్రదేశాలలో బహుళ దాడులు నిర్వహించబడ్డాయి. ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లాకు చెందిన ప్రగతిశీల కార్మిక సమాక్య (PKS) రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చంద్ర నరసింహులు అనే వ్యక్తిని అరెస్టు చేసి ఘటనా స్థలం నుంచి 14 రౌండ్లతోపాటు ఒక పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు. కడప జిల్లాలోని ఒక ప్రాంగణంలో 13 లక్షలు, ఇతర ప్రాంతాల నుంచి మావోయిస్టు సాహిత్యం, పత్రాలు స్వాధీనం చేసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు, పలనాడు, విజయవాడ, రాజమండ్రి, ప్రకాశం, బాపట్ల, ఏలూరు, తూర్పుగోదావరి డిఆర్ అంబేద్కర్ కోనసీమ, విశాఖపట్నం, విజయనగరం, నెల్లూరు, తిరుపతి, కడప సత్యసాయి, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో 53 ప్రాంతాల్లో ఈరోజు దాడులు జరిగాయి. తెలంగాణలో హైదరాబాద్, మహబూబ్ నగర్, హనుమకొండ, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లోని 9 చోట్ల సోదాలు జరిగాయి.

పౌర హక్కుల కమిటీ (CLC), అమరుల బంధు మిత్రుల సంఘం (ABMS), చైతన్య మహిళా సంఘం (CMS), కుల నిర్మూలన పోరాట సమతి (KNPS), పేట్రియాటిక్ డెమోక్రటిక్ మూవ్‌మెంట్ (PDM), ప్రగతిశీల కార్మిక సమక్య (PKS), ప్రజాకళా సంఘాలు ఉన్నాయి. మండలి (PKM), విప్లవ రచయితల సంఘం (RWA) లేదా విప్లవరచయితలసంఘం (VIRASAM), మానవ హక్కుల వేదిక (HRF), రాజకీయ ఖైదీల విడుదల కోసం కమిటీ (CRPP), ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పీపుల్స్ లాయర్స్ (IAPL) తదితర సంస్థలతో మావోయిస్టు పార్టీకి ఉన్న సంబంధాలు, ఈ రోజు అరెస్టు చేసిన వ్యక్తీని విచారించడం వల్ల బైటపడే అవకాశం ఉందని భావిస్తున్నాం.

మావోయిస్టుల కదలికలు, ముంచింగ్‌పుట్ ప్రాంతంలో మావోయిస్టు సాహిత్యం రవాణాకు సంబంధించిన సమాచారం ఆధారంగా 2020 నవంబర్ 23న ASR జిల్లా ముంచింగ్‌పుటు పోలీసులు కేసు నమోదు చేశారు. పాంగి నాగన్న అనే వ్యక్తి మావోయిస్టు విప్లవ సాహిత్య పుస్తకాలు, మందులు, రెడ్ కలర్ బ్యానర్ క్లాత్, ఎలక్ట్రికల్ వైర్ బండిల్స్, నిప్పో బ్యాటరీలు , కరపత్రాలను మావోయిస్టు కార్యకర్తలకు అందజేయడానికి తీసుకువెళుతుండగా పోలీసులు అడ్డుకున్నారు. పాంగి నాగన్నను సమగ్రంగా విచారించగా, ఈ వస్తువులను ప్రజాసంఘాల‌ నాయకులు అతనికి అందజేసినట్లు తేలింది.

అయితే NIA ఆరోపణలను ప్రజా సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ప్రగశీల కార్మిక సమైక్య లో పనిచేస్తున్న చంద్ర నరసింహులు వద్ద ఆయుధాలు దొరికాయని ఎన్ఐఏ పోలీసులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, కుట్రపూరితమైన కేసు బనాయించే ప్రయత్నం చేస్తున్నారని, రెండు రాష్ట్రాల్లో ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలపై NIA దాడులకు దిగడం అప్రజాస్వాకమైన చర్య అని ప్రజా సంఘాలు మండిపడ్డాయి.

Keywords : NIA, Andhrapradesh, Telangana, CLC, ABMS, IAPL,virasam,
(2024-04-26 16:51:23)



No. of visitors : 665

Suggested Posts


కలకత్తాలో జరుగుతున్న చారుమజుందార్ శత జయంతి ఉత్సవాల్లో విరసం కార్యదర్శి పాణి స్పీచ్

నక్సల్బరీ లేకపోతే భారత పీడిత ప్రజానీకానికి విప్లవ‌ దారే లేకుండా పోయేది. కమ్యూనిస్టు రాజకీయాలు చర్చించుకోవడానికే తప్ప వర్గపోరాట బాట పట్టకపోయేవి. ఆ నక్సల్బరీ దారిని చూపినవాడు చారు మజుందార్. విప్లవ పార్టీకి వ్యూహాన్ని, ఎత్తుగడలను ఒక సాయుధ పోరాట మార్గాన్ని చూపించిన వాడు చారు మజుందార్.

ఆదివాసి.. లంబాడా వివాదం ‍- ఎం.రత్నమాల

మహారాష్ట్ర ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి తెగగా గుర్తించడం లేదు కనుక ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి షెడ్యూల్డు తెగగా ప్రకటించడంతో దీన్ని అవకాశంగా తీసుకుని మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌ (పాత) జిల్లాకు లంబాడాల వలసలు పెద్ద ఎత్తున వెల్లువలా సాగాయి.....

మహాశ్వేతా దేవి - మన తెలంగాణ సాగర హారంః వరవర రావు

మన మహా సాగరహారం ʹచలో హైదరాబాద్ అంటూ తెలంగాణ మార్చ్ చేసిన సెప్టెంబర్ 30, 2012 మహత్తర మధ్యాహ్నం మహాశ్వేతాదేవి కూడా మన ఊర్లో ఉన్నారు. ఆ రోజు ఆమెను మన మధ్యకు తెచ్చుకొని ఉంటే....

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

1947 ఆగస్ట్ 15న విలీనానికి అంగీకరించకుండా షరతులు విధిస్తూ వచ్చిన నిజాంను నెహ్రూ - పటేల్ ప్రభుత్వం సగౌరవంగా, సాదరంగా చర్చలకు ఆహ్వానించింది. అప్పటికే నిజాంను వ్యతిరేకిస్తూ వీరోచిత పోరాటం నడుపుతున్న కమ్యూనిస్టులను మాత్రమే కాదు, కనీసం కాంగ్రెస్ ను కూడా ఈ చర్చల్లో భాగం చేయలేదు....

అమరుడు బొజ్జా తారకం — ʹనది పుట్టిన గొంతుకʹ - వరవరరావు

గోదావరి తెలంగాణలో ప్రవేశించిన నిజామాబాద్ కు 1968లో వచ్చిన తారకం గారు ఇక్కడి మట్టిలోని ఎరుపులోనూ, ఇక్కడి నీళ్లలోని ప్రవాహ గుణంలోనూ కలగలిసిపోయారు. 1968 నుంచి 78 దాకా ఒక దశాబ్దం పాటు విప్లవోద్యమాలకు, విప్లవ సాహిత్యానికి నిజామాబాద్ చిరునామా బొజ్ఞాతారకం....

ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పోరాటానికి విరసం మద్దతు

అట్టడుగున ఉన్న మనిషికి ఫలితాలు అందినప్పుడే సామాజిక న్యాయం జరిగినట్టు లెక్క. మాదిగ, డక్కలి, చిందు, మాష్టి, బుడగజంగం, దాసరి, బేగరి కులాలకు ఈ నాటికీ ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు....

ʹఅన్నలు మల్లొస్తరు బిడ్డా.. ఆల్లొస్తే వాళ్ళకు గిన్ని మంచి నీల్లో, తిండో పెట్టాలనే బతుకుతాన్నʹ

అందుకే అంత నిర్బంధంల కూడా నా కొడుకు అంత్యక్రియలకు వచ్చిన జనాలకు మా ఖిలా వరంగల్ సరిపోలె. ఎక్కడోల్లను అక్కడ అరెస్ట్ చేసినా వచ్చిండ్రు. ఎవరో నక్సలైట్ అట, చిన్న పిల్లగాడేనట, బలే తెలివికల్లోడట అని అనుకుంట జనాలు వచ్చిండ్రు. పద్దెనిమిది నిండి పందొమ్మిది పడగానే చంపేసిండ్రు.

కాగడాగా వెలిగిన క్షణం... అమరుడు యెం యెస్ ఆర్ కోసం ... నారాయణ స్వామి

ఎంత ప్రాణం శ్రీనుది బక్క పలుచగా ఉండేటోడు – ఎక్కడన్న సరిగ్గా తిన్నడో లేదో శరీరం లో బలం సత్తువ ఉన్నదో లేదో – ఆ దుర్మార్గులు పట్టుకొని చిత్రహింసలు పెడుతుంటే ఆ లేత శరీరం ఎంత గోస పడిందో ఎంత హింసకు గురైందో ఎంత అల్లల్లాడిందో – ఆ క్రూరులు చంపేయ్యబోతుంటే, చివరికి మేఘే ఢాకా తార లో సుప్రియ అరిచినట్టు నాకు బతకాలని ఉంది నాకు చావాలని లేదు నాకు బతకాలని ఉంది....

ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల‌

అంతకుముందు అంతర్జాతీయ శ్రామికవర్గ పతాకావిష్కరణతో కార్యక్రమాలను ప్రారం భించారు. అమరుడు పులి అంజన్న తల్లి సైదమ్మ ఎర్ర జెండాను, సీనియర్ విరసం సభ్యురాలు రత్నమాల విప్లవ రచయితల సంఘం జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా అమరుడు శేషయ్య సోదరుడు సాంబయ్య, అమరుడు వివేక్ తండ్రి యోగానంద్ అమరుల స్థూపాన్ని ఆవిష్క రించారు.

ʹఅరుణోదయʹ పై పోలీసుల దాడిని ఖండించిన విరసం

తెలంగాణ ఉద్యమంలో ఆట పాటతో ఆరుణోదయ కళాకారులు గ్రామ గ్రామాన తిరిగి ప్రజల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ వంతు కృషి చేశారు. ఆ సంస్థ కార్యాలయాన్ని దౌర్జన్యంగా మూసేయడం అత్యంత నిరంకుశమైన......

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
మణిపూర్ లో ప్లాటినం, క్రోమైట్, నికెల్ వంటి ఖనిజ సంపదను దోచుకోవడానికే కుకీల ఊచకోత -మావోయిస్టు పార్టీ
more..


తెలంగాణ,