5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌

5

5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలని సీపీఐ మావోయిస్టు ప్రజలకు పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఓ ప్రకటన విడుదల చేశారు.

అభయ్ ప్రకటన పూర్తి పాఠం:
ఐదు రాష్ట్రాల విధానసభ ఎన్నికలను బహిష్కరించండి!

భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్ట్) కేంద్రకమిటీ ఐదు రాష్ట్రాలు - ఛత్తీస్ గఢ్, తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాంలలో జరగబోయే బూటకపు విధానసభ ఎన్నికలను బహిష్కరించమని ఆయా రాష్ట్రాల ప్రజలకు పిలుపునిస్తున్నది. ఈ ఎన్నికల బహిష్కరణను ఒక రాజకీయ కేంపెయిన్ గా నడపాలనీ, మన పోరాట ప్రాంతాల్లో ప్రభుత్వ సాయుధ బలగాల తీవ్రమైన దాడులను ఎదుర్కోవడం కోసం ఎత్తుగడల ఎదురుదాడుల (టీసీఓసీ)తో జోడించి ఈ అభియాన్ నడపాలని పార్టీ, పీ.ఎల్.జీ.ఏ., ప్రజాసంఘాల, విప్లవ ప్రజా ప్రభుత్వాలకు (దండకారణ్యంలో స్థానిక గోండీ భాషలో జనతన సర్కార్ అంటారు) చెందిన అన్ని శ్రేణులకు కేంద్రకమిటీ దిశా- నిర్దేశనం చేస్తున్నది.

ప్రస్తుతం ఈ ఎన్నికల్లో పాల్గొంటున్న చిన్న, పెద్ద పార్టీలన్నీ దోపిడీ పాలకవర్గాల, సామ్రాజ్యవాదుల, దేశంలోని దళారీ నిరంకుశ పెట్టుబడిదారుల, బడా భూస్వాములకు ప్రాతినిధ్యం వహించేవే, వాళ్ల ప్రయోజనాలను నెరవేర్చేవే.

దేశంలో అతిపెద్ద పార్టీ, కేంద్రంలోనూ, అత్యధిక రాష్ట్రాల్లోనూ అధికారంలో వున్న, ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ) పరివారంకు చెందిన భారతీయ జనతా పార్టీ దేశ వైవిధ్యాన్నీ, బహుళత్వాన్ని అంతం చేస్తూ భారత దేశాన్ని హిందూ దేశంగా మార్చే దిశలో దూకుడుగా ముందుకు సాగుతున్నది. ఇది దేశానికీ, దేశానికి చెందిన పీడిత వర్గాలకు (కార్మికులు, కర్షకులు, పెటీ బూర్జువా, జాతీయ బూర్జువా), ప్రత్యేక సామాజిక వర్గాలకు (దళితులూ, ఆదివాసులూ, మహిళలూ, మతపర మైనారిటీలు) చెందిన ప్రజలకు చాలా పెద్ద ప్రమాదం.

అన్నింటి కంటే ఎక్కువ సమయం దేశ, రాష్ట్రాల్లో అధికారంలో వున్న కాంగ్రెస్ ప్రస్తుతం బలహీనపడినప్పటికీ, దాని స్వభావం ప్రజా వ్యతిరేకమైనదీ, ప్రజలను అణచిపెట్టేది. అది దేశంలో సామ్రాజ్యవాద ప్రపంచీకరణ విధానాలను ప్రారంభించడమే కాదు, అది అధికారంలో వున్న అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తున్నది.

మా పార్టీ ఐదు రాష్ట్రాల్లో జరగబోయే బూటకపు విధానసభ ఎన్నికలను బహిష్కరించమనే పిలుపుతో పాటే రాష్ట్రాల వారీగా విభిన్న రాజకీయ పార్టీల పట్ల మా వైఖరిని కింది విధంగా ప్రకటిస్తున్నది.

ఛత్తీస్ గఢ్ లో ʹదేశానికీ, ప్రజలకూ అత్యంత ప్రమాదకారిగా వున్న బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు భారతీయ జనతా పార్టీని తన్ని తరమండిʹ, ʹసామ్రాజ్యవాద ప్రపంచీకరణ విధానాలను అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక కాంగ్రెసును తీవ్రంగా వ్యతిరేకించండిʹ, ʹఓట్లు అడగాలని వచ్చే మిగతా పార్లమెంటరీ పార్టీలను ప్రజా కోర్టులో నిలదీయండిʹ, ʹజనతన సర్కార్లను రక్షించండి, బలోపేతం చేయండిʹ.

కేసీఆర్ నాయకత్వంలోని భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) బీజేపీకి అనుకూల పార్టీ కనుక, తెలంగాణలో ʹబ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు బీజేపీ, దానికి మద్దతునిచ్చే అవకాశవాద బీఆర్ఎస్ లను తన్నితరమండి, మిగతా పార్టీలను ప్రజాకోర్టులో నిలదీయండిʹ.
ఛత్తీస్ గఢ్ లో ఇచ్చిన పిలుపే మధ్య ప్రదేశ్, రాజస్థాన్, మిజోరాంలకు వర్తిస్తుంది.
మన దేశంలో అధికార మార్పిడి తర్వాత 1952 నుండీ నేటి వరకూ ప్రతి అయిదేళ్లకు ఒకసారి లోకసభ, విధానసభలకు ఎన్నికలు జరుగుతూ వస్తున్నాయన్నది అందరికీ తెలుసు. ప్రభుత్వాలు ఏర్పడుతూ, మారుతూ వస్తున్నాయి. ప్రభుత్వాలను ఏర్పాటు చేసే పార్టీలు మారుతూ వస్తున్నాయి. కానీ ఈ ఎన్నికల ద్వారా దేశ అర్ధ వలస, అర్థ భూస్వామ్య సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక వ్యవస్థలో మౌలిక మార్పు సాధ్యం కాలేదు, ప్రజల జీవితాల్లో చెప్పుకోదగిన ఏ మార్పు రాలేదు. రాదు కూడా. ఎందుకంటే ఈ ఎన్నికలు వాస్తవానికి దోపిడీ పాలక వర్గాలకు చెందిన విభిన్న ముఠాల మధ్య పోటీ వంటివి. రాబోయే ఐదేళ్లలో ఏ ముఠా ప్రజలపై అధికారం చెలాయించాలి, వాళ్లను దోచుకోవాలి, అణచివేయాలి అనేది నిర్ధారించడానికే ఆ పోటీ.
దేశంలో దోపిడీకి కారణమైన వర్తమాన అర్థ వలస, అర్థ భూస్వామ్య సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక వ్యవస్థను ధ్వంసం చేసి, నాలుగు పీడిత వర్గాల (కార్మికులు, రైతులు, పెటీ బూర్జువా, దేశీయ బూర్జువా), ప్రత్యేక సామాజిక వర్గాల (దళితులు, ఆదివాసులు, మహిళలు, మతపర మైనారిటీలు) ప్రజల నూతన ప్రజాస్వామ్య రాజ్యాధికారాన్ని నిర్మించేందుకు మా పార్టీ విప్లవోద్యమాన్ని కొనసాగిస్తున్నది. దీర్ఘకాలిక ప్రజా యుద్ధ మార్గంలో వర్గ పోరాటం, ప్రజాయుద్ధం నడుపుతూ ఆ దిశలో ముందుకు పురోగమిస్తూ ప్రజా రాజ్యాధికార అంగాలను, విప్లవ ప్రజా కమిటీలను నిర్మిస్తున్నది.

భారత దోపిడీ పాలక వర్గాలూ, వారికి ప్రాతినిధ్యం వహించే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ రాజ్యాధికార సంస్థలనూ, మా పార్టీనీ, పీ.ఎల్.జీ.ఏ.నూ, ప్రజా సంఘాలనూ, ప్రజా పోరాటాలను నిర్మూలించడం కోసం సల్వాజుడుం, గ్రీన్ హంట్, సమాధాన్, వర్తమాన విప్లవ ప్రతీఘాతుక, ప్రగతి నిరోధక సూరజ్ కుండ్ వ్యూహాత్మక పథకం వంటి ప్రతీఘాతుక నిర్బంధ విధానాలను అమలు చేస్తున్నాయి. దేశ ప్రజల సంపత్తిని, ప్రాకృతిక వనరులను దేశ, విదేశ కార్పొరేట్లకు కట్టబెట్టడం కోసం కార్పొరేటీకరణ, దానిని సుగమమం చేయడం కోసం సైన్యీకరణ వంటి ప్రజా వ్యతిరేక విధానాలను అమలుచేస్తున్నాయి.
అందువలన దోపిడీ ప్రభుత్వాలను ఎన్నుకోవడం కోసం జరిగే ఎన్నికలను బహిష్కరిస్తూ, మా పార్టీ నాయకత్వంలో కొనసాగుతున్న నూతన ప్రజాస్వామ్య విప్లవంలో భాగమై ప్రజా రాజ్యాధికార అంగాలను పరిరక్షిస్తూ, బలోపేతం చేయాలనీ, తద్వారా వాటిని విస్తరించే దిశలో సామ్రాజ్యవాద - దళారీ నిరంకుశ పెట్టుబడిదారీ - భూస్వామ్య వ్యతిరేక వర్గ పోరాటంలోనూ, ప్రజా యుద్ధంలోనూ (గెరిల్లా యుద్ధం)లోనూ భాగం కావాలని మా పార్టీ పిలుపునిస్తోంది.

అభయ్
అధికార ప్రతినిధి
కేంద్ర కమిటీ
భాకపా (మావోయిస్టు)

Keywords : cpi maoist, abhay, elections, telangana, rajasthan, chattis garh, mijoram, madhyapradesh,
(2024-04-26 16:52:23)



No. of visitors : 878

Suggested Posts


పాలకులకు లొంగిపోయిన‌ విప్లవ‌ద్రోహి గజ్జెల సత్యం రెడ్డిని ఎండగట్టండి... మావోయిస్టు పార్టీ ప్రకటన‌

విడుదల తర్వాత ఆర్.టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా ఆయన తన లొంగుబాటునూ, రాజకీయ పతనాన్ని నిస్సిగ్గుగా బయటపెట్టుకున్నాడని ,మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ అన్నారు.

జంపన్నలేఖ‌కు మావోయిస్టు అభయ్ జవాబు - లేఖ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ

జూన్‌ 18న సీ.పీ.ఐ (మావోయిస్టు) అధికార ప్రతినిధిగా నేను ʹకొరోనాతో మావోయిస్టుల మరణం ఒక బూటకం, అది కేవలం పోలీసుల సృష్టిʹ అనే పత్రికా ప్రకటనను ఇచ్చాను. ఇందులో జంపన్నపై ʹవిప్లవ రాజకీయాల నుండి హీనాతిహీనంగా దిగజారిపోయిన

PLGA సావనీర్ విడుదల చేసిన మావోయిస్టు పార్టీ - అభయ్ ఆడియో ప్రకటన‌

పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ PLGA ఏర్పడి 20 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా సీపీఐ మావోయిస్టు ఓ సావనీర్ విడుదల చేసింది. 20 ఏళ్ళ వేడుకల సందర్భంగా ఈ సావనీర్ విడుదల చేసినట్టు

అమ్మా! నను మన్నించు.. తల్లి మరణంపై మావోయిస్టు నాయకుడు వేణుగోపాల్ లేఖ!

మల్లోజుల కుటుంబంతో, పెద్దపల్లి పట్టణంతో వందేళ్ల నీ రుణం తీర్చుకున్నావా అమ్మా! నీ కడుపున పుట్టిన ఆరుగురి సంతానంలో నేనే చివరివాన్ని తల్లీ. నిను చివరి వరకు ఏడ్పించిన వాన్నీ నేనే అమ్మా.

పోలీసు చిత్రహింసల వల్ల రెండేళ్ళు కోమాలో ఉండి అంతిమ శ్వాస విడిచిన చింతన్ దా కు విప్లవ జోహార్లు -మావోయిస్టు పార్టీ

సీపీఐ (మావోయిస్టు) కేంద్రకమిటీ సభ్యులు కామ్రేడ్ నరేంద్ర సింగ్ (అశోదా, చింతన్ దా) ఒక పట్టణంలోని ఆసుపత్రిలో 2020 జనవరి 6న అంతిమశ్వాస విడిచారు. ఆయన దీర్ఘకాలికంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 2018 నుంచి కోమాలో ఉన్నారు. ఆయన వయసు 74 సంవత్సరాలు.

Chhattisgarh:ఆయుధాలు వదిలి చర్చలకు రావాలన్న సీఎం పిలుపుకు మావోయిస్టుల జవాబు

మావోయిస్టులు ఆయుధాలు వదిలేసి చర్చలకు రావాలని చత్తీస్ గడ్ ముఖ్యమంత్రి భూపేష్ భగేల్ మాట్లాడిన నేపథ్యంలో ఆ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. తాము కూడా చర్చలకు సిద్దమే అని

11 మంది రేపిస్టుల విడుదలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌

2002 గుజరాత్ అల్లర్లలో బిల్కిస్ బానో ను అత్యాచారం చేసి 14 మందిని హత్య చేసిన దోషులను గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడాన్ని CPI (మావోయిస్ట్) కేంద్ర కమిటీ ఖండిస్తోంది.

మా నాయకత్వానికి కరోనా సోకి, లొంగిపోతున్నారన్న ప్రచారం ఓ కట్టుకథ -మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రకటన‌

అనేక మంది మావోయిస్టులకు కరోనా సోకిందని, అందువల్ల అనేక మంది మావోయిస్టులు లొంగిపోనున్నారని పోలీసులు చేస్తున్న ప్రచారాన్ని మావోయిస్టు పార్టీ తీవ్రంగా ఖండించింది. ఇలాంటి కథలు సృష్టించడంలో ఉభయ తెలుగు రాష్ట్రాల పోలీసు బాస్ లు మహా నేర్పరులని ఆ పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ

గద్ద‌ర్ మరణం మమ్మల్ని తీవ్రంగా భాదకు గురి చేసింది. మా సంతాపాన్ని, కుటుంబానికి మా సానుభూతి తెలియ జేస్తున్నాము.

భారతదేశాన్ని ఫాసిస్టు నాజీకరణ చేసే ప్రయత్నంలో భాగమే ʹఅగ్నిపథ్ʹ -మావోయిస్ట్ పార్టీ

భారత సైన్య త్రివిధ బలగాలలోకి యువతను కాంట్రాక్టు పద్దతిలో భర్తీ చేసుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ నూతన ʹఅగ్నిపథ్ʹ పథకాన్ని, అందుకు వ్యతిరేకంగా పది రాష్ట్రాలకు వ్యాపించిన, బిహార్ రాష్ట్రంలో రైల్వేల ధ్వంసం మొదలయిన సంఘటనలతో జరుగుతున్న ప్రజల అందోళనలపై తెలంగాణా రాష్ట్రం సికిందరాబాద్ ప్రాంతంలో కాల్పులలో వరంగల్ కు చెందిన రాకేష్ అనే వ్యక్తి మరణానికి,

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
మణిపూర్ లో ప్లాటినం, క్రోమైట్, నికెల్ వంటి ఖనిజ సంపదను దోచుకోవడానికే కుకీల ఊచకోత -మావోయిస్టు పార్టీ
more..


5