అది ఎన్‌కౌంట‌ర్ కాదు - అత్యాచారం చేసి చంపేశారు : నిజ‌నిర్థార‌ణ బృందం

చ‌త్తీస్‌ఘ‌డ్‌లో ఆదివాసీల‌పై పోలీసుల అకృత్యాల‌కు అంతులేకుండా పోతోంది. అత్యాచారాలు, హ‌త్య‌లు, గృహ‌ద‌హ‌నాలు, బూట‌క‌పు ఎదురు కాల్పులు నిత్యకృత్యంగా మారాయి. అమాయ‌క ఆదివాసీ ప్ర‌జ‌ల‌పై పోలీసులు, పారామిల‌ట‌రీ బ‌ల‌గాలు దౌర్జ‌న్యాల‌కు పాల్ప‌డుతున్నాయి. అడ‌విలో ఖ‌నిజ సంప‌ద‌ను కార్పోరేట్ కంపెనీల‌కు అప్ప‌గించేందుకు ప్ర‌భుత్వం ఆదివాసీల‌ను అడ‌వి నుంచి గెంటివేయ‌జూస్తోంది. అందులో భాగంగా దండ‌కార‌ణ్యంలో భ‌యాన‌క వాతార‌వ‌ణం సృష్టిస్తోంది. వారం క్రితం చ‌త్తీస్‌ఘ‌డ్ లోని సుక్మా జిల్లా కుంట స్టేష‌న్ ప‌రిధిలోని గోంపాడు గ్రామంలో మ‌డ్కం హిడ్మే హ‌త్య పోలీసుల దాష్టికానికి పరాకాష్ట. 13వ తేది జ‌రిగిన ఈ బూట‌క‌పు ఎన్‌కౌంట‌ర్‌పై విచార‌ణ జ‌రిపిన పౌర‌హ‌క్కుల సంఘం, ఓపీడీఆర్‌ నిజ నిర్థార‌ణ బృందం దృష్టికి ఒళ్లు గ‌గుర్పొడిచే విష‌యాలు వ‌చ్చాయి. నిజ నిర్థార‌ణ బృందం స‌భ్యులు ప్రొఫెస‌ర్ ల‌క్ష్మ‌ణ్‌, నారాయ‌ణ‌రావు, చిలుకా చంద్ర‌శేఖ‌ర్, కుమార స్వామి, విప్ల‌వ కుమార్‌, బీరం రాములువెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం - ʹ13 తేది తెల్ల‌వారు జామున 3గంట‌ల ప్రాంతంలో దాదాపు 300 మంది జిల్లా రిజ‌ర్వ్ గార్డ్స్, స్పెష‌ల్ టాస్క్ ఫోర్స్ గంప‌డ్ గ్రామాన్ని చుట్టుముట్టి.. గ్రామంలోని పిల్ల‌లు, వృద్ధులు, చిన్నా, పెద్ద ప్ర‌జ‌లంద‌రినీ తీవ్రంగా కొట్టారు. మ‌డ్కం హిడ్మే ఇంట్లోకి వ‌చ్చి పోలీసులు హిడ్మే అమ్మా, నాన్న‌, 6 సంవ‌త్స‌రాల‌, 10 సంవ‌త్స‌రాల ఆమె సోద‌రుల‌ను తీవ్రంగా చిత‌క‌బాదారు. దీంతో ఎందుకు కొడుతున్నారంటూ హిడ్మే పోలీసుల‌ను ప్ర‌శ్నించింది. దీంతో త‌మ పోలీసుల చ‌ర్య‌ల‌ను ఎదిరించినందుకు హిడ్మేను ఇంట్లోంచి బ‌య‌ట‌కు లాక్కొచ్చి ఆమె చెవులు, ముక్కుపోగుల‌ను తీసుకున్నారు. అక్క‌డి నుంచి ఆమె అడ‌వి వైపుకు లాక్కెల్లారు. హిడ్మేను వ‌దిలివేయాల‌ని గ్రామ‌స్తులు ఎంత‌గా బ‌తిమిలాడినా పోలీసులు వ‌దిలివేయ‌లేదు. పైగా.. గ్రామ‌స్తుల‌ను త‌మ వెన‌కాల రావ‌ద్ద‌ని హెచ్చ‌రించారు. త‌మ వెన‌కాలే వ‌స్తే... ఇక్క‌డిక్క‌డే ఈ అమ్మాయిని కాల్చేస్తామ‌ని హెచ్చ‌రించారు. దీంతో గ్రామ‌స్తులు అక్క‌డే ఆగిపోయారు. హిడ్మేతో పాటు పోలీసులు ఇళ్ల‌లో చొర‌బ‌డి బియ్యం, ఎండ‌బెట్టిన మాంసం, డ‌బ్బులు, క‌త్తులు, గొడ్డ‌లు తీసుకొని అడ‌వి వైపుకు వెళ్లారు. రాత్రి 1గంట స‌మ‌యంలో పోలీసులు హిడ్మే ఒంటిపై దుస్తులను తొల‌గించి... సామూహిక అత్యాచారానికి పాల్ప‌డ్డారు. శరీర భాగాల‌న్నింటినీ క‌త్తుల‌తో కోశారు. ఆ త‌రువాత చాతీపై, క‌డుపులో తూటాల వ‌ర్షం కురిపించారు. మృత‌దేహాన్ని సుక్మా ప‌ట్ట‌ణానికి త‌ర‌లించారు. 14వ తేది విష‌యం తెలుసుకున్న గ్రామ‌స్తులు వెళ్లే స‌రికి హిడ్మే మృత‌దేహం ఆలీవ్‌గ్రీన్ దుస్తుల్లో క‌నిపించింది. మ‌ర్నాడు పేప‌ర్‌లో ఎన్‌కౌంట‌ర్‌లో మ‌హిళా న‌క్స‌లైట్ మ‌డ‌కం హిడ్మే మృతి అంటూ పోలీసులు ప్ర‌క‌టించినట్లు వార్త‌లొచ్చాయి.ʹ

Keywords : hidme, encounter, fake encounter, maoist, adivasi girl, chathisgarh, police, special task force, district reserve force, telangana, fact finding, civil liberties committee, clc, opdr,
(2024-04-28 04:15:07)



No. of visitors : 19638

Suggested Posts


శృతిని అత్యాచారం చేసి, హింసలు పెట్టి చంపారు - వరవరరావు

వరంగల్ జిల్లాలో మంగళవారంనాడు ఎన్ కౌంటర్ జరిగినట్టు పోలీసులు చెబుతున్నది అబద్దమని శృతిని విద్యాసాగర్ లను పోలీసులు పట్టుకొని చిత్రహింసలు పెట్టి చంపారని విప్లవ రచయిత వరవరరావు ఆరోపించారు....

శ్రుతి పాడిన పాట దోపిడి గుండెల్లో తూట !

శ్రుతి.... చిన్నప్పటినుండే విప్లవ భావాలతో పెరిగింది. సమాజాన్ని నిశితంగా గమనిస్తూ, సమాజాన్ని చదువుతూ పెరిగింది. వేదికలెక్కి సమాజాన్ని చైతన్య పరిచే పాటలు పాడింది. ఎమ్ టెక్ చదివిన శ్రుతి తన తండ్రి సుదర్శన్ చెప్పినట్టు అమెరికాకు కాకుండా అడవిలోకి....

రాజ్యం పెంచి పోషించిన ప్రజా హంతకుడు నయీం - మావోయిస్టు పార్టీ

హంతక ప్రభుత్వాల పోలీసు యంత్రాంగం ఎస్ఐబి డైరెక్షన్లో ఎంతో మంది ప్రజలను, పౌరహక్కుల నేతలను, ఉద్యమకారులను కిరాతకంగా చంపిన ప్రజా హంతకుడు నయీం చావు వార్త పీడిత ప్రజలకు పండుగ వంటిదే కాకుంటే తనను పెంచి, పోషించి ఎన్నో చీకటి హత్యలకు ఆయుధంగా వాడుకున్న దోపిడీ పాలక వర్గం చేతిలో కన్నా ప్రజల చేతిలో నయినాం ఖతం అయితే ప్రజలు ఎక్కువగా సంతోషపడేవాళ్ళు...

చీప్ లిక్కర్ తో గ్రామజ్యోతిని వెలిగిస్తారా - మావోయిస్టు జగన్ ప్రశ్న

ప్రభుత్వం హరితహారం లో మొక్కలు నాటడం కోసం ఆదివాసులను భూముల్లోంచి వెళ్ళగొడతోందని జగన్ మండి పడ్డారు. ఒక వైపు ప్రజలను చీప్ లిక్కర్ లో ముంచి తేల్చే కుట్రలు చేస్తూ మరో వైపు గ్రామ జ్యోతి కార్యక్రమాన్ని మొదలు పెట్టడం పై జగన్ మండి పడ్డారు. చీప్ లిక్కర్ తో గ్రామ జ్యోతిని వెలిగిస్తారా

ఫేస్ బుక్ మిత్రుడి ఎన్ కౌంటర్ !

సార్ మీరు నాకు తెలుసు... మీరు నాఫేస్ బుక్ ఫ్రెండ్ సార్..... దండకారణ్యంలో భుజానికి తుపాకీ వేసుకొని తీక్షణంగా పరిసరాలను పరీక్షిస్తూనే మరో చేత్తో వంట చేస్తున్న.. ప్రతిక్షణం యుద్దం మధ్యలో జీవిస్తున్న ఓ మావోయిస్టు గెరిల్లా ఆమాట అనడంతో నేను షాక్ తిన్నాను.....

నక్సల్బరీ రాజకీయాలను ఎత్తి పట్టండి - ‍మావోయిస్టు పార్టీ నేత గణపతి పిలుపు

నేడు దేశంలో బ్రాహ్మణవాద శక్తులు ప్రభుత్వాన్ని పాలిస్తున్న నేపథ్యంలో దేశంలో అసహన పరిస్థితులు నెలకొన్నాయని, వాటికి వ్యతిరేకంగా మేథావులను, కార్మిక, శ్రామిక, ప్రజాస్వామ్య వర్గాలను, దళితులను, మైనారిటీ మతాలను, విద్యార్థులను సంఘటితం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని గణపతి చెప్పారు.....

ఈ విప్లవ యోధుడి అమరత్వానికి 21 యేండ్లు !

అది 1996 జూన్ 23 ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల దగ్గర నస్పూర్ కాలానిలో ఓ ఇల్లు.... ఆ ఇంటిని 500 మంది పోలీసులు చుట్టుముట్టారు. ఎలాంటి హెచ్చరికలు లేవు... లొంగి పొమ్మన్న మాటలు లేవు. ఏక పక్షంగా తూటాల వర్షం కురిపించిడం....

జనతన రాజ్యంలో నక్సల్బరీ వేడుకలు... 80 వేల మందితో సభ‌ (వీడియో)

మావోయిస్టు పార్టీ ద‌క్షిణ బ‌స్త‌ర్ డివిజ‌న్ క‌మిటీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన న‌క్స‌ల్బ‌రీ వేడుక‌లు ప్ర‌పంచానికి ఇప్ప‌డు కొత్త ఆశనిస్తున్నాయి. ఒక్క‌రిద్ద‌రు కాదు.. దాదాపు 80 వేల మంది ఆదివాసీలు. సుశిక్షితులైన ప్ర‌జా విముక్తి గెరిల్లాలతో క‌లిసి క‌దంతొక్కారు.

ఈ నెల 26 న తెలంగాణ బంద్ కు మావోయిస్టు పార్టీ పిలుపు

గొల్లగూడెం ఎన్ కౌంటర్ కు నిరసనగా ఈ నెల 26 న తెలంగాణ బంద్ ను జయప్రదం చేయాలని సీపీఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పిలుపునిచ్చారు. మహారాష్ట్రా గడ్చిరోలి జిల్లా, వెంకటాపురం పోలీస్ స్టేషన్ పరిధి గొల్లగూడెం అడవుల్లో...

ఆ శవాలు మాట్లాడుతున్నవి...

శరీరాన్ని చీల్చేసినట్టుగా, పొడిచేసినట్టుగా కనపడుతున్న ఆ శవాలు మాట్లాడుతున్నవి. పురుగులు పట్టిన ఆ శవాలు మాట్లాడుతున్నవి.....

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


అది