అమరుల బంధుమిత్రుల సంఘం
పత్రిక ప్రకటన
15-5-2026
తెలంగాణ రాష్ట్రంలోని హనుమకొండ జిల్లా చింతగట్టు గ్రామంలో రాకేష్ స్థూపాన్ని అడ్డుకొని కూల్చి వేయడాన్ని ఖండిస్తున్నాము.
గత సంవత్సరం మే 21న మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి బసవరాజుతో పాటు అమరుడైన రాకేష్ జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు తమ ఇంటి వద్ద నిర్మాణం చేసుకున్న స్థూపాన్ని ఈరోజు ఉదయం 10 గంటలకు కూల్చివేయడాన్ని, ఆ కుటుంబ సభ్యుల్ని అక్రమంగా అదుపులో తీసుకోవడాన్ని అప్రజాస్వామిక చర్య మేము భావిస్తున్నాము. వారిని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము.
బిడ్డ శవాన్ని కూడా ఇవ్వక ఇతర మరో రాష్ట్ర ప్రభుత్వం వేధించింది. ఇప్పుడు ఇంటి దగ్గర తమ కుమారుడి జ్ఞాపకంగా నిర్మించుకున్న స్థూపాన్ని కూల్చి ఈ రాష్ట్ర ప్రభుత్వం వేదిస్తుంది.
గతంలో జానారెడ్డి హోమ్ మంత్రిగా వున్నపుడు సొంత స్థలాల్లో స్థూపాలు కట్టుకుంటే వాటిని కదిలించమని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చి నిలబెట్టుకుంది. అందుకని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి స్థూప నిర్మాణానికి అనుమతి ఇవ్వాలి. ఇలాంటి కక్ష సాధింపు ధోరణి ఆపివేయాలని డిమాండ్ చేస్తున్నాము.
అంజమ్మ
రాష్ట్ర అధ్యక్షురాలు
శాంత
ఉపాధ్యక్షురాలు
పద్మ కుమారి
కార్యదర్శి

వార్ టూరిజం : జాఫ్నా టూ బస్తర్ – ముసాఫిర్
మావోయిస్టు పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడి మరణం
చివరి రక్తం బొట్టు వరకు విప్లవ పంథా కోసం నిలబడ్డ యోధుడు కామ్రేడ్ రాజు దాదా
విద్రోహ కాలంలో విప్లవ పంథా కోసం ప్రాణత్యాగం చేసిన యోధుడు కామ్రేడ్ రాజు దాదా
తెలంగాణలో ఉద్యమకారులకు NIA నోటీసులు
పాట్నా జైలులో CPI(మావోయిస్టు) పోలిట్బ్యూరో సభ్యుడు ప్రమోద్ మిశ్రా ఆమరణ నిరాహార దీక్ష 