ఏటూరు నాగారం చల్పాక అడవుల్లో ఎన్ కౌంటర్ జరిగిందని అందులో ఏడుగురు మావోయిస్టులు మరణించారని చెప్తున్న పోలీసుల మాటలు అబద్దమని ఆ ఏడుగురు తినే ఆహారంలో విషం కలిపి కస్టడీలోకి తీసుకుని అనంతరం వారిని చిత్రహింసలకు గురిచేసి కాల్చి చంపారని ఆరోపిస్తున్న పౌరహక్కుల సంఘం ఈ అంశంపై ఈ రోజు రాష్ట్ర హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఏడుగురి భౌతికకాయాలను రేపటి వరకు భద్రపర్చాలని ఆదేశిస్తూ కేసును రేపటికి వాయిదా వేసింది.
మావోయిస్టుల మృతదేహాలపై తీవ్ర గాయాలు ఉన్నాయని.. కనీసం కుటుంబ సభ్యులకు కూడా చూపించకుండా మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారని కోర్టుకు పౌరహక్కుల్ అసంఘం తరపు న్యాయవాది వివరించారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (NHRC) నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరించారని న్యాయవాది కోర్టులో వాదించారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం తరుపు న్యాయవాది… అడవిలో పోలీసులు భద్రత దృష్ట్యా మృతదేహాలను వెంటనే ములుగు ఆస్పత్రికి తరలించారని న్యాయస్థానానికి తెలిపారు.కాకతీయ మెడికల్ కాలేజీకి చెందిన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించామని అన్నారు. ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియో తీసినట్లు కోర్టుకు తెలిపారు.
ఇరువైపుల వాదనలు విన్న అనంతరం హైకోర్టు పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా… పోస్టుమార్టం ముగిసిన తర్వాత రేపటి (డిసెంబర్ 3వ తేదీ) వరకూ మృతదేహాలను భద్రపరచాలని.. ఆ మృతదేహాలను కుటుంబ సభ్యులకు, బంధువులకు చూపించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను రేపటికి (మంగళవారం) వాయిదా వేసింది.

చర్లపల్లి జైలులో మావోయిస్టు రాజకీయ ఖైదీ నిరహార దీక్ష
”దండకారణ్యంలో పాలకులు చేస్తున్న మారణకాండకు వ్యతిరేకంగా గొంతు విప్పుదాం”
చల్పాక ‘ఎన్ కౌంటర్’ :నిజాలు బహిర్గతపర్చిన మావోయిస్టు పార్టీ…9న బంద్ కు పిలుపు!
‘రేవంత్ సర్కార్ చేసిన 16 మంది మావోయిస్టుల హత్యలపై హైకోర్టు జడ్జితో న్యాయ విచారణ జరపించాలి’
ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ
Open Letter to Chief Minister of Chhattisgarh 